
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
ఒక కేజీ బాస్మతి రైస్, ఒక కేజీ చికెన్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నెయ్యి, నూనె, యాలకులు- నాలుగు, లవంగాలు- ఆరు, దాల్చిన చెక్క, ఒక స్పూన్ షాజీరా, బిర్యానీ ఆకులు, స్టార్ అనైజ్ (అనాస పువ్వు), నిమ్మకాయ, ఉప్పు, ఒక కప్పు పెరుగు, మూడు ఉల్లిపాయలు, ఒక స్పూన్ కెవరా వాటర్.
ఈ వస్తువులన్నీ మన ప్రతి ఇంట్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటితో బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. బిర్యానీ రుచిగా ఉండాలంటే ఒక కేజీ చికెన్కు ఒక కేజీ రైస్ సమానంగా ఉండాలి. అయితే రుచి ఇంకా అద్భుతంగా ఉండాలంటే ఒక పావు కేజీ చికెన్ అదనంగా తీసుకోవడం మంచిది. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి కర్రీ తయారీ మొదలుపెట్టాలి.
ముందుగా కడాయి తీసుకుని నూనె వేసి, అందులో కొంచెం నెయ్యి వేస్తే రుచి చాలా బాగుంటుంది. అందులో యాలకులు, మిగిలినన మసాలా(సగం) వేసి, వెంటనే ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపాలి. అయితే దీనికి ముందుగా చికెన్ను మ్యారినేట్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. కనీసం ఒక గంట పాటు చికెన్ను ఫ్రిజ్లో ఉంచడం మంచిది.ఈ మ్యారినేట్ చేసిన చికెన్ను కడాయిలో వేసి బాగా మగ్గించాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి.
చికెన్ మ్యారినేషన్ చేయడం: చికెన్ మ్యారినేట్ చేయడం చాలా సులభం. గరం మసాలా పొడి, పెరుగు, ఉప్పు, కారం, మీకు కావాల్సినంత నెయ్యి, అర చెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక గంట పాటు ఫ్రిజ్లో ఉంచండి.
READ Also: ఈ 5 గింజలు తింటే ఆకలి వేయదు.. కొవ్వును సహజంగా కరిగించే మ్యాజికల్ సీడ్స్!
కూర సిద్ధంగా ఉంది కాబట్టి, బాస్మతి రైస్ను ఒక అరగంట ముందుగా నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో రెండు స్పూన్ల నెయ్యి, కొద్దిగా నూనె వేసి, అందులో సగం మసాలాలు వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి దోరగా వేయించాలి. ఒక స్పూన్ రాళ్ల ఉప్పు, కొద్దిగా పెరుగు వేసి, తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి. ఆ నీటిలో అర చెక్క నిమ్మరసం కూడా పిండాలి. నీరు మరుగుతున్నప్పుడు నానబెట్టిన రైస్ వేసి, సుమారు 80 శాతం వరకు ఉడికించాలి. ఇప్పుడు ఉడికిన రైస్ను మనం వండుకున్న చికెన్ పైన లేయర్లా వేయాలి. పైన నిమ్మరసం, రోజ్ వాటర్, కెవరా వాటర్, ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి 'దమ్' పెట్టాలి. దమ్ పెట్టేటప్పుడు నేరుగా స్టవ్ మీద కాకుండా, కింద ఒక పెనం పెడితే బిర్యానీ మాడకుండా ఉంటుంది. పిండి ముద్దతో మూత అంచులను సీల్ చేస్తే బిర్యానీ పొడిపొడిగా, రుచికరంగా వస్తుంది. మనం కీమా, చికెన్ ముక్కలు కలిపి వండుతాము కాబట్టి, ప్రతి బైట్లో కీమా వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ సండే మీరు కూడా ఇలాంటి బిర్యానీని తయారు చేసుకుని ఆస్వాదించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.