
IND vs IRE : ఐర్లాండ్తో బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూడటమే కాకుండా.. సిరీస్ గెలిచే అవకాశాన్ని కూడా చేజార్చుకుంది.
కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం వల్ల 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ చుట్టూ ఒక పెద్ద వివాదం, గందరగోళం నెలకొంది. మైదానంలో అందరూ అతను హాఫ్ సెంచరీ పూర్తి చేశాడని సంబరాలు చేసుకున్నప్పటికీ, చివరకు అధికారిక స్కోరు బోర్డులో మాత్రం అతను 49 పరుగులకే అవుట్ అయినట్లు ప్రకటించారు.
భారత ఇన్నింగ్స్ చేజింగ్ సమయంలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ వన్ మ్యాన్ షో చేశాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ లో అభిషేక్ శర్మ కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడని అంతా భావించారు. ఒకవేళ అది నిజమై ఉంటే అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అది ఒక సరికొత్త ప్రపంచ రికార్డు అయ్యేది. లైవ్ మ్యాచ్ చూస్తున్న అధికారిక బ్రాడ్కాస్టర్లు, ప్రముఖ లైవ్ క్రికెట్ స్కోరింగ్ యాప్లు కూడా అభిషేక్ శర్మకు ఇది 12వ అంతర్జాతీయ హాఫ్ సెంచరీ అంటూ స్కోరు బోర్డులో మార్చేశాయి. అంతెందుకు స్వయంగా బీసీసీఐ సైతం తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో అభిషేక్ 19 బంతుల్లో 50 పరుగులు చేశాడంటూ ఒక పోస్ట్ కూడా పెట్టింది. కానీ ఆ తర్వాత బంతికే అభిషేక్ అవుట్ కాగా, అతను 20 బంతుల్లో 49 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరినట్లు థర్డ్ అంపైర్ ప్రకటించారు.
1st T20I.Abhishek Sharma 50 runs in 19 balls (7x4, 2x6) India 78/3 #TeamIndia #IREvIND # 1st T20I— BCCI (@BCCI) June 26, 2026 హాఫ్ సెంచరీ రద్దు కావడానికి గల అసలు కారణం ఈ విచిత్రమైన ట్విస్ట్కు గల అసలు కారణాన్ని పరిశీలిస్తే క్రికెట్ రూల్స్ లోని ఒక సాంకేతిక అంశం బయటపడింది. భారత ఇన్నింగ్స్ మధ్యలో ఐర్లాండ్ బౌలర్ జై ముండ్రా వేసిన ఒక ఓవర్ లో అభిషేక్ శర్మ లెగ్ సైడ్ లో వచ్చిన ఒక షార్ట్ డెలివరీని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో బంతి షార్ట్ ఫైన్ లెగ్ వైపు వెళ్లగా భారత బ్యాటర్లు ఒక పరుగు తీశారు. అయితే ఆ సమయంలో ఫీల్డ్ అంపైర్ పొరపాటున ఆ పరుగును బ్యాట్ నుంచి వచ్చిన రన్ గా భావించి అభిషేక్ ఖాతాలో వేశారు. కానీ ఆ తర్వాత బ్యాక్డ్రాప్లో రీప్లేలను పరిశీలించిన మ్యాచ్ అఫీషియల్స్, థర్డ్ అంపైర్.. ఆ బంతి బ్యాట్కు ఎక్కడా తగల్లేదని, అది పూర్తిగా బ్యాటర్ ప్యాడ్కు తగిలి వెళ్ళిందని నిర్ధారించారు. దీంతో ఆ పరుగును అభిషేక్ వ్యక్తిగత ఖాతా నుంచి తొలగించి, టీమ్ ఎక్స్ట్రాల ఖాతాలో లెగ్ బైగా మార్చారు.
#Abhisheksharma #ireland #indvsire Paras Yadav (@Yadav7Paras) June 26, 2026 అంపైర్లు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అభిషేక్ శర్మ ఖాతాలో ఒక రన్ తగ్గిపోవడంతో, అతను హాఫ్ సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. ఒకవేళ ఆ రన్ గనుక బ్యాట్ కే తగిలి ఉంటే, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఐదుసార్లు 20 బంతుల లోపు హాఫ్ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్గా అభిషేక్ చరిత్ర సృష్టించేవాడు. పాపం ఈ విషయం తెలియని అభిషేక్ శర్మ తర్వాతి బంతికే భారీ షాట్కు ప్రయత్నించి 49 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆయన అవుట్ అయిన తర్వాత భారత మిడిల్ ఆర్డర్ ఘోరంగా కుప్పకూలింది. ఒక దశలో 80 పరుగులకు 3 వికెట్లతో పటిష్టంగా ఉన్న భారత్, ఆ తర్వాత కేవలం 148 పరుగులకే ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ మినహా మరే ఇతర భారత బ్యాటర్ కూడా కనీసం 25 పరుగుల మార్కును కూడా దాటలేకపోవడంతో ఐర్లాండ్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి