
ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ఇంట పెళ్లి బాజాలు మోగడం తెలిసిందే. ఖుష్బూ కుమార్తె అవంతిక సుందర్కు శ్రావణ్ శ్రీనివాసన్తో వివాహం జరిగింది.
ఈ సంతోషకరమైన వార్తను పంచుకుంటూ ఖుష్బూ ఇన్స్టాగ్రామ్లో ఒక సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆనందంతో తమ కళ్లు చెమర్చాయని, ఇది తమ జీవితంలో మర్చిపోలేని మధుర క్షణమని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు."ఈ సమయంలో ఆనందంతో మాకు మాటలు రావడం లేదు. తల్లిదండ్రులుగా, కుటుంబమే మాకు సర్వస్వం. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని మేము నమ్ముతాం. మా ప్రియ కుమార్తె అవంతిక సుందర్కు, శ్రావణ్ శ్రీనివాసన్కు 2026 జూన్ 25న వివాహం జరిగిందని తెలియజేస్తున్నాం" అని ఆమె పేర్కొన్నారు.కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల ప్రేమ, ఆప్యాయతల మధ్య ఈ వివాహ వేడుక జరిగిందని, అందరి ఆత్మీయత ఈ వేడుకను ఎంతో మ్యాజికల్గా మార్చిందని ఖుష్బూ వివరించారు. ఇది చాలా కొద్దిమందితో, నిరాడంబరంగా జరుపుకున్న వేడుక అని, తమ పిల్లలు కోరుకున్నట్టే ఈ పెళ్లిని జరిపించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు."అవంతిక, శ్రావణ్ తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఈ తరుణంలో, వారిద్దరూ సంతోషంగా, అన్యోన్యంగా జీవించాలని కోరుకుంటూ మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలని కోరుతున్నాను. ఎంతో ప్రేమ, గర్వంతో మా నూతన వధూవరులు అవంతిక, శ్రావణ్ను మీకు పరిచయం చేస్తున్నాం" అంటూ ఆమె తన పోస్ట్ను ముగించారు.