
దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం మళ్లీ పుంజుకుంది. ఏప్రిల్ నెలలో స్వల్పంగా నెమ్మదించిన క్రెడిట్ కార్డు వ్యయాలు, మే నెలలో గణనీయంగా పెరిగాయి.
2026 మే నెలలో క్రెడిట్ కార్డుల ద్వారా జరిగిన మొత్తం వ్యయం రూ. 2,023 బిలియన్లకు చేరింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 6.6 శాతం అధికం కాగా, ఏప్రిల్ నెలతో పోలిస్తే 2.6 శాతం వృద్ధి నమోదైంది.ఈ ఏడాది మే నెలలో దేశీయ క్రెడిట్ కార్డుల రంగం ఒక కీలక మైలురాయిని అధిగమించింది. సుమారు 10 లక్షల కొత్త కార్డులు జారీ కావడంతో, మొత్తం కార్డుల సంఖ్య 12.05 కోట్లకు చేరుకుంది. గత 15 నెలల్లో ఇదే అత్యధిక వార్షిక వృద్ధి (8.7 శాతం) కావడం గమనార్హం. లావాదేవీల సంఖ్య కూడా వార్షిక ప్రాతిపదికన 25.8 శాతం వృద్ధితో 587 మిలియన్లకు చేరుకుంది.మరోవైపు, ఒక్కో లావాదేవీపై సగటు వ్యయం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. చిన్న చిన్న మొత్తాల్లో కొనుగోళ్లకు కూడా క్రెడిట్ కార్డుల వాడకం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రధాన బ్యాంకుల పనితీరులో మిశ్రమ ఫలితాలు కనిపించాయి. కార్పొరేట్ వినియోగం బలంగా ఉండటంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్డు సగటు వ్యయంలో 12 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4.2 శాతం నెలవారీ వృద్ధిని సాధించింది. డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్ వ్యాప్తితో క్రెడిట్ కార్డుల మార్కెట్ విస్తరిస్తున్నప్పటికీ, పెరుగుతున్న వడ్డీ రేట్ల నేపథ్యంలో బ్యాంకులు రివార్డు పాయింట్ల విధానంలో