
భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో మిడ్ రేంజ్ సెగ్మెంట్ను షేక్ చేయడానికి సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త మొబైల్తో సిద్ధమైంది. తన పాపులర్ గెలాక్సీ ‘ఎం’ సిరీస్లో మరో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది
. శాంసంగ్ గెలాక్సీ ఎం 47 5జీ (Samsung Galaxy M47 5G) ఫోన్ను ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
పవర్ యూజర్లు, మొబైల్ గేమర్స్ను టార్గెట్ చేస్తూ భారీ బ్యాటరీ, అల్టిమేట్ ఏఐ ఫీచర్లు, సూపర్ స్పీడ్ డిస్ప్లేతో ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. జూన్ 29న ఈ మొబైల్ ఇండియాలో గ్రాండ్గా లాంచ్ కానుంది. ఈ ఫోన్ బ్లేజ్ బ్లూ, రోగ్ రెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.
డిజైన్ పరంగా చూస్తే ఈ ఫోన్ లేటెస్ట్ గెలాక్సీ 'ఏ' సిరీస్ మోడల్స్ లాగే ఫ్లాట్ రియర్ కెమెరా సెటప్, పిల్ షేప్డ్ కెమెరా మాడ్యూల్తో చాలా క్లాసీగా కనిపిస్తోంది. ఇందులో 6.7-ఇంచుల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్ప్లేను ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల స్క్రీన్ స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా ఉంటుంది.
స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ను ఉపయోగించారు. దీనివల్ల ఫోన్ కిందపడినా గీతలు పడకుండా, పగలకుండా గట్టి రక్షణ లభిస్తుంది. 2 మీటర్ల ఎత్తు నుంచి పడినా తట్టుకునే కెపాసిటీ దీనికి ఉందని కంపెనీ చెబుతోంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ M47 5G ఫోన్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 జెన్ 3 ఆక్టా కోర్ ప్రాసెసర్ను ఉపయోగించారు. ఇది 4nm ప్రాసెస్పై పనిచేస్తుంది. దీనికి తోడుగా బడ్జెట్ రేంజ్లో ఎవరూ ఇవ్వని విధంగా అల్ట్రా ఫాస్ట్ LPDDR5x RAM, UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ను అందించారు.
ఈ సెగ్మెంట్లోని పోకో X7, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్, వన్ప్లస్ నార్డ్ CE 4 లైట్ వంటి పోటీ ఫోన్లు ఇప్పటికీ పాత LPDDR4x ర్యామ్తోనే వస్తుండగా, శాంసంగ్ మాత్రం అడ్వాన్స్డ్ ర్యామ్తో 20 శాతం ఎక్కువ బ్యాండ్విడ్త్ను ఆఫర్ చేస్తోంది. దీనివల్ల యాప్స్ మరింత స్పీడ్ గా ఓపెన్ అవుతాయి, మల్టీటాస్కింగ్ సూపర్ ఫాస్ట్గా సాగుతుంది.
శాంసంగ్ గెలాక్సీ M47 5G లో ఏకంగా 6,000mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే హ్యాపీగా రెండు రోజులు వస్తుంది. దీనితో పాటు 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ముఖ్యంగా మొబైల్ గేమర్స్ కోసం ఇందులో బైపాస్ ఛార్జింగ్ అనే క్రేజీ ఫీచర్ను పెట్టారు.
మనం గేమింగ్ ఆడేటప్పుడు ఛార్జింగ్ పెడితే, కరెంట్ నేరుగా బ్యాటరీకి వెళ్లకుండా ఫోన్ మదర్బోర్డ్కు అందుతుంది. దీనివల్ల ఫోన్ అస్సలు హీట్ అవ్వదు. బ్యాటరీ లైఫ్ కూడా అస్సలు పాడవదు. కాలేజ్ స్టూడెంట్స్, హెవీ యూజర్లకు ఈ ఫీచర్ ఒక బూస్ట్ లాంటిదని చెప్పొచ్చు.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కాగా, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్తో వస్తుంది. దీనివల్ల ఫోటోలు, వీడియోలు షేక్ అవ్వకుండా చాలా క్లియర్ గా వస్తాయి. దీంతో పాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి.
సెల్ఫీల కోసం ఫ్రంట్లో 12 మెగాపిక్సెల్ హెచ్డీఆర్ కెమెరాను హోల్ పంచ్ కటౌట్లో ఇచ్చారు. ఈ ఫోన్ ద్వారా యూజర్లు 4K హై రిజల్యూషన్ వీడియోలను రికార్డ్ చేయవచ్చు. అంతేకాదు, తక్కువ లైటింగ్లో కూడా అద్భుతమైన ఫోటోలు తీసేందుకు శాంసంగ్ నైటోగ్రఫీ సాఫ్ట్వేర్ను ఇందులో జోడించింది.
ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 16 బేస్డ్ శాంసంగ్ One UI 8.5 వెర్షన్తో వస్తుంది. మిడ్ రేంజ్ ఫోన్లలో ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 6 సంవత్సరాల పాటు ఓఎస్ అప్గ్రేడ్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని శాంసంగ్ ప్రామిస్ చేసింది. అంటే ఈ ఫోన్ కొంటే ఫ్యూచర్ ఫుల్ సెక్యూర్ అన్నమాట. ఇందులో గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్, ఏఐ వాయిస్ ట్రాన్స్క్రిప్షన్ వంటి అడ్వాన్స్డ్ ఏఐ ఫీచర్లు ఉన్నాయి. దాంతో పాటు నాక్స్ వాల్ట్, ఆటో బ్లాకర్ వంటి హై లెవెల్ సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధర విషయానికి వస్తే.. శాంసంగ్ ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ మార్కెట్ విశ్లేషకుల ప్రకారం, ఈ ఫోన్ రూ. 20,000 నుంచి రూ. 25,000 బడ్జెట్ రేంజ్లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. బేస్ వేరియంట్ గనుక రూ.23,000 లోపు ఉంటే, మార్కెట్లో మిగతా బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. లాంచ్ రోజు బ్యాంక్ ఆఫర్స్ ద్వారా మరో రూ.1,500 నుంచి రూ.2,000 వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. ఫ్లిప్కార్ట్, శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లలో ఈ ఫోన్ సేల్కు రానుంది.