
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముతో మంత్రివర్గ విస్తరణకు అనుకూలమైన తేదీలపై మంత్రి అమిత్ షా చర్చించినట్లు...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముతో మంత్రివర్గ విస్తరణకు అనుకూలమైన తేదీలపై మంత్రి అమిత్ షా చర్చించినట్లు తెలుస్తుంది.
న్యూఢిల్లీ, జూన్ 26: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 28 లేదా జూన్ 29వ తేదీన కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముతో మంత్రివర్గ విస్తరణకు అనుకూలమైన తేదీలపై ఆయన చర్చించినట్లు తెలుస్తుంది. కొత్త మంత్రివర్గంలోకి ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రధాని ముఖ్య కార్యదర్శి శక్తి కాంత దాస్కు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని సమాచారం.
అలాగే ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శాఖ మారుస్తారనే ప్రచారం సాగుతోంది. ఆమెకు విద్యాశాఖ కేటాయిస్తారనే చర్చ నడుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకుంటారు. ఎన్డీఏకు మద్దతు ఇచ్చిన శివసేనకు ఈ మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉంది. ఆ పార్టీ ఎంపీ శ్రీకాంత్ షిండేకు మంత్రి పదవి లభించనుంది.
కొత్త మంత్రుల జాబితాలో ఎంపీలు అరుణ్ గోవిల్, విష్ణుదత్ శర్మ, జనార్దన్ సింగ్ సిగ్రీవాల్ పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం ప్రస్తుత ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉంది. పంజాబ్లో పార్టీ బలోపేతం కోసం రవ్నీత్ బిట్టు స్థానంలో తరుణ్ చుగ్కు స్థానం కల్పించనున్నారు.
కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్తోపాటు మనోహర్ లాల్ ఖట్టర్ శాఖలు మార్చే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, హర్దీప్ సింగ్ పూరీతోపాటు అరడజను మంది సహాయ మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉందనే ప్రచారం కొనసాగుతోంది.
ముస్లిం సోదరులకు మొహర్రం శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు, లోకేశ్