ఆమెకు అప్పటికే రెండు పెళ్లిళ్లయ్యాయి.. ఇంతలో రైల్వే ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది.. అతడితో సహజీవనం చేసింది.. అతడితో మూడో పెళ్లికి సిద్ధమైంది. ఇంతలో ఆమె పాత పెళ్లిళ్ల వ్యవహారం అతడికి తెలిసింది..
అప్పటి నుంచి ఆమెను దూరం పెట్టడంతో సీన్ రివర్స్ అయ్యింది. వెంటనే ఆ లేడీ కిలాడీ రూట్ మార్చింది.. తనను మోసం చేశాడంటూ అతడిపై వరుసగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదే, పదే పోలీసులు పిలుస్తుండటంతో మనస్తాపం చెందిన రైల్వే ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి జిల్లాలో సంచలనం రేపిన రైల్వే ఉద్యోగి రవి సూసైడ్ నోటుతో ఈ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి.తూర్పుగోదావరి జిల్లా కడియానికి చెందిన రవి రైల్వే సీఆర్ఎస్లో టెక్నీషియన్గా తిరుపతి జిల్లా రేణిగుంటలో పనిచేస్తున్నారు. అతడికి మంగళం ప్రాంతానికి చెందిన ఉషారాణితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.. కొద్ది రోజులకు ఉషారాణి గురించి రవికి తెలిసింది. ఆమెకు అప్పటికే వివాహాలు జరిగాయని తెలియడంతో అప్రమత్తమయ్యాడు. ఉషారాణిని దూరం పెట్టాడు.. రవి దూరం కావడంతో ఉషారాణి అతడిపై కోపం పెంచుకుంది. రవి తనని మోసం చేశాడని తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రవిని పిలిచి విచారణ కూడా చేశారు. ఇంతలో రవి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలకం రేపింది.. చనిపోయే ముందు రవి సూసైడ్ నోట్లో సంచలన విషయాలు రాశారు.ఉషారాణి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు రవి సూసైడ్ నోట్లో ఆరోపించారు. ఉష పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ విషయాన్ని సెటిల్ చేసుకోవాలని చెప్పారని.. రైల్వే సర్వీస్ రికార్డులు, ఇన్స్యూరెన్స్ పాలసీల్లో తన పేరు పెట్టాలని ఉష తనను వేధించినట్లు రవి నోట్లో రాశారు. రైల్వే సర్వీస్ రికార్డులో ఉష తన పేరు భార్యగా చేర్చాలని ఒత్తిడి చేసి.. ఆ తర్వాత తనను చంపేసి ఉద్యోగం పొందాలనుకుందని రవి ఆరోపించారు. ఉష పదే, పదే తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని.. స్టేషన్కు పిలిచి ఉష జోలికి వెళ్లకుండా ఉండాలని తనతో సంతకం చేయించుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఉష తనపై వరుసగా ఫిర్యాదులు చేయడంతో తాను విసుగు చెందానని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రవి తన సూసైడ్ నోట్లో రాశారు. రవి సోదరుడు విష్ణుకుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవి చనిపోవడానికి ముందు రాసిన 22 పేజీల సూసైడ్ నోట్లో ఆరు పేజీలు ఉషారాణి నుంచి అనుభవించిన చిత్రహింసల గురించి ఉంది. మరో 16 పేజీల్లో కొన్ని ఆధారాలను పొందుపరిచారు. ఉష తనను తప్పుడు కేసులతో బెదిరించిన విషయాన్ని నోట్లో రాశారు. అలాగే రవి గతంలోనే ఉషారాణి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.