
ఇంటర్నెట్ డెస్క్: ‘ధర్మన్’.. ది డెడ్లీ డాక్టర్ అంటూ తన 173వ సినిమాతో సందడి చేయడానికి సిద్ధమయ్యారు అగ్ర కథానాయకుడు రజనీకాంత్ (Rajinikanth).
అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని కమల్హాసన్ నిర్మిస్తున్నారు. సిమ్రన్, రాశీఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో (Dharman) తలైవా న్యాయాన్ని గెలిపించే ఓ వైద్యుడిగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ మేకింగ్ వీడియోను ‘ది ఓజీ స్వాగ్’ అనే క్యాప్షన్తో టీమ్ విడుదల చేసింది.