
నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ జిల్లా పెద్దముద్దునూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీని వీడి పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
గురువారం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మోత్కూరి నాగయ్య, మోత్కూరి అయోధ్య, పుల్జాల మహేష్, నల్లగంటి మహేష్, మోత్కూరి శివ, బుసిపాగ బాలకృష్ణ, బి నాగరాజు.బి రాములు, బి. నిరంజన్తో పలువురు బీఆర్ఎస్లో చేరారు.
వారికి జనార్దన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆ పార్టీ అవినీతి అక్రమాలను చూడలేకనే బీఆర్ఎస్లో చేరుతున్నారని జనార్దన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీలోని కార్యకర్తలకు సరైన గుర్తింపు లభిస్తుందన్నారు.