
Mock Drill At Tirumala PAC 5: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదు. వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి 10 గంటలు, SSD దర్శనానికి 8 గంటలు, అలాగే ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. తిరుమలలో భద్రతను మరింత పెంచే క్రమంలో అక్టోపస్ భద్రతా దళాలు ఒక మార్క్ డ్రిల్ నిర్వహించాయి.
తిరుమల భద్రతను బలోపేతం చేయడానికి ఆక్టోపస్ దళాలు ఈ ప్రత్యేక డ్రిల్ను చేశారు. అర్ధరాత్రి సమయంలో తిరుమల వెంకటాద్రి నిలయం పీఏసీ 5 ఏరియాలో భారీగా సిబ్బంది, గన్స్ పట్టుకుని ప్రవేశించారు.
ఒకేసారి 50 మంది సిబ్బంది ఆపరేషన్లో పాల్గొంటూ, ఉగ్రవాదులుగా భావించిన కొందరిని అదుపులోకి తీసుకున్నట్లుగా చూపించారు. వారి చేతులు, కాళ్లు కట్టేసి బంధీలను ఎలా రక్షించాలో కూడా ప్రాక్టీస్ చేశారు.
ఏదైనా కొండపైకి ఉగ్రవాదులు చొరబడితే భద్రతా బలగాలు ఎలా స్పందించాలి, ప్రజలను ఎలా కాపాడాలి, ఎమర్జెన్సీ టైంలో ఎలా ఉండాలి అనే అంశంపై మాకు డ్రిల్ నిర్వహించారు.
అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వాహనాలు ఘటన జరిగిన చోటికి చేరుకొని, అక్కడ భక్తులకు ఏం జరిగిందో అర్థం కాక కాస్త ఆసక్తిగా గమనించారు. ఈ విన్యాసాల ద్వారా తిరుమల భద్రతా సిబ్బంది అప్రమత్తతను, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పరీక్షించారు.
భక్తుల భద్రతే లక్ష్యంగా ఇలా చేస్తున్నామని టిటిడి అధికారులు కూడా చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమలలో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం కొండపై ఉంటారు.
తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా అలాగే ఉంది. సర్వదర్శనానికి 10 గంటలు, SSD దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. కేవలం ఒక్కరోజే 84,235 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 29 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే రూ. 5.18 కోట్ల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.