
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Vijay) విషయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) మరోసారి తన ఆప్యాయత ప్రదర్శించారు. ఇవాళ విజయ్ ను ఉద్దేశించి జగన్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
విజయ్ పుట్టినరోజు సందర్భంగా జగన్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. గతంలో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ జగన్ ఇలాగే ట్వీట్ చేశారు. దీంతో ఇద్దరు యువ నేతల మధ్య అనుబంధం కూడా మరోసారి చర్చనీయాంశమవుతోంది.కర్నాటకకు వ్యతిరేకంగా అసెంబ్లీని ఏకతాటిపైకి తెచ్చిన విజయ్..! తమిళనాడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి, సోదరులు విజయ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ జగన్ ఇవాళ ట్వీట్ చేశారు. అలాగే మీరు నిండు ఆరోగ్యంతో, చేపట్టే అన్ని పనులలోనూ విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని జగన్ తెలిపారు. తద్వారా విజయ్ విషయంలో తన ఆప్యాయతను మరోసారి చాటుకున్నారు. గతంలో చెన్నైలో తన సోదరుడి పెళ్లి సందర్భంగా జగన్ చివరిసారిగా విజయ్ ను కలిశారు. హలో ఇండియా- ఇదీ ఏపీ పరిస్దితి..! జగన్ సంచలన ట్వీట్..!తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం విజయ్ కు వైఎస్సార్సీపీ నేతలు మద్దతు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకూ వీరిద్దరూ రాజకీయాల విషయంలో బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడుకోవడం కానీ, ప్రకటనలు చేసుకోవడం కానీ జరగలేదు. అయినా జగన్, విజయ్ అనుబంధంపై మాత్రం ఇరు రాష్ట్రాల్లోనూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో జగన్ ఇండియా కూటమిలోకి వచ్చే అవకాశం ఉంటే విజయ్ తో కలిసి పని చేయొచ్చనే అంచనాలున్నాయి.