
ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చడంలో అత్యంత కీలకమైన ఖతార్లోని 'రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ'లో ఆదివారం రాత్రి (జూన్ 21) ఘోర ప్రమాదం సంభవించింది.
అక్కడి బర్జాన్ గ్యాస్ సరఫరా ప్లాంట్లో ఆపరేషన్లను, ఎగుమతులను తిరిగి ప్రారంభించడానికి సిబ్బంది ప్రయత్నిస్తుండగా భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ విస్ఫోటనం కారణంగా కనీసం 54 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా, మరో 18 మంది ఆచూకీ గల్లంతైనట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. పేలుడు ధాటికి ఆకాశంలోకి దట్టమైన నల్లటి పొగ, మంటలు కిలోమీటర్ల దూరం వరకు కనిపించడంతో రాజధాని దోహా నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రముఖ ఇంధన సంస్థ 'ఖతార్ ఎనర్జీ' ఈ ఘటనను ధ్రువీకరించింది. అత్యవసర రెస్క్యూ బృందాలు, సివిల్ డిఫెన్స్ దళాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయని స్పష్టం చేసింది. గతంలో ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ జరిపిన మిసైల్ దాడుల వల్ల ఈ ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిని, వారాల తరబడి మూతపడింది. ఆ నష్టాన్ని పూడ్చుకుని, ఉత్పత్తిని మళ్లీ గరిష్ఠ స్థాయికి చేర్చేందుకు ఇంజనీర్లు ప్లాంట్ను పునఃప్రారంభిస్తున్న సమయంలోనే ఈ సాంకేతిక ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఖతార్ అంతర్జాతీయ సెర్చ్ అండ్ రెస్క్యూ గ్రూప్ గల్లంతైన 18 మంది కార్మికుల కోసం ప్లాంట్ శిథిలాల మధ్య ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతోంది. ప్లాంట్ లోపల జరిగిన అంతర్గత పేలుడు వల్ల ప్రజారోగ్యానికి లేదా పర్యావరణానికి ముప్పు తెచ్చే ఎలాంటి