
తిరుపతి - కడప సూపర్ లగ్జరీ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెంది
న చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యశ్విత కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అమరావతి, జూన్ 22: తిరుపతి - కడప సూపర్ లగ్జరీ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యశ్విత కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. తీవ్రగాయాలైన వారికి మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
రోడ్డు భద్రతా ప్రమాణాలు, బస్సు - లారీ వివరాలపై ఫోన్లో అధికారులతో మంత్రి మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు. తిరుపతి జిల్లా పుల్లంపేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నెల్లూరు ఏఎస్పేట దర్గా వివాదం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. వక్ఫ్కు లేఖ
కడపలో విషాదం.. ఇసుక క్వారీ గుంతలో పడి అన్నదమ్ముల దుర్మరణం