
పాస్పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియలో ప్రదర్శించిన అత్యుత్తమ పనితీరుకు గాను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. 2025 సంవత్సరంలో అంది
ంచిన సేవలకు గుర్తింపుగా 'ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర్ స్టేట్ పోలీస్'ను ఏపీ పోలీస్ విభాగం కైవసం చేసుకుంది.న్యూఢిల్లీలో నిర్వహించిన పాస్పోర్ట్ సేవా దివస్ వేడుకల్లో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తరఫున ఇంటెలిజెన్స్ విభాగం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ఎ. రమాదేవి ఈ గౌరవప్రదమైన అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పోలీస్ శాఖ పనితీరు మెరుగుపడిందని తెలిపారు. ఇంటెలిజెన్స్ విభాగం, జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్ల సమష్టి కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొంటూ ఆయన సిబ్బందిని అభినందించారు.పౌరులకు అత్యంత కీలకమైన పాస్పోర్ట్ జారీ ప్రక్రియలో పోలీస్ వెరిఫికేషన్ను వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేయడంలో రాష్ట్ర పోలీస్ శాఖ చూపిన చొరవకు ఈ అవార్డు నిదర్శనంగా నిలుస్తోంది. తద్వారా రాష్ట్రంలో పరిపాలనా సామర్థ్యం మెరుగుపడినట్లు స్పష్టమవుతోంది.