
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Yoga Special: భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా...నేడు విశ్వవ్యాప్తమైంది. సరిహద్దులు దాటి... ప్రపంచ దేశాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చింది. ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది యోగాసనాలతో రోజును ప్రారంభిస్తున్నారు. శరీరానికి ధృడత్వాన్ని, మనస్సుకు ప్రశాంతతను ఇచ్చే ఈ ప్రాచీన విద్య ప్రాధాన్యతను ఐక్యరాజ్యసమితి గుర్తించి దశాబ్ద కాలం దాటింది. అప్పటి నుంచి ఇప్పటివరకు యోగా క్రేజ్ వరల్డ్ వైడ్ గా నానాటికీ పెరుగుతూనే ఉంది.
వేదకాలం నుంచే యోగా.. వేద కాలంలో పుట్టి...హిమాలయాల నుంచి ఇల్లాళ్ల ముంగిట దాకా చేరిన మహోన్నత కళ.. యోగా! కేవలం శారీరక వ్యాయామం కాదు.. ఆత్మను, శరీరాన్ని ఏకం చేసే ఒక దివ్య సాధన. భారత్... ప్రపంచానికి అందించిన అత్యంత విలువైన కానుక యోగ. "భాషలు వేరైనా.. దేశాలు వేరైనా.. యోగాసనాల ముందు ప్రపంచమంతా ఒక్కటవుతోంది. అమెరికా నుంచి ఆఫ్రికా దాకా.. లండన్ నుంచి టోక్యో దాకా.. జూన్ 21న విశ్వమంతా యోగా మంత్రంతో పులకించిపోతోంది. "ఒకప్పుడు యోగా అంటే కేవలం మునులు, వృద్ధులకే పరిమితం అనుకునేవారు. కానీ నేడు ట్రెండ్ మారింది! ఐటీ ఉద్యోగుల ఒత్తిడిని దూరం చేయాలన్నా, సినీ సెలబ్రిటీల ఫిట్నెస్ రహస్యమైనా, క్రీడాకారుల ఏకాగ్రతకైనా.. యోగా ఒక్కటే శరణ్యమైంది. జిమ్ల కంటే యోగా శాలలకే నేటి యువత జై కొడుతోంది.
"మారుతున్న కాలంతో పాటు యోగా కూడా అప్గ్రేడ్ అయింది. కార్పొరేట్ ఆఫీసుల్లో 'డెస్క్ యోగా' పేరుతో ఉద్యోగుల ఒత్తిడిని తగ్గిస్తున్నారు. అటు డిజిటల్ స్క్రీన్లకు అలవాటు పడిపోతున్న నేటి తరం పిల్లలకు ఏకాగ్రత పెరగడానికి 'ప్రాణాయామం', 'ధ్యానం' ఎంతగానో తోడ్పడుతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా.. బాలల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ యోగా ఒక నిత్య జీవిత భాగస్వామిగా మారిపోయింది.
జూన్ 21 అంటేనే ప్రపంచానికి గుర్తొచ్చేది అంతర్జాతీయ యోగా దినోత్సవం.. అంతకంటే ముందుగా గుర్తొచ్చే ముఖం ప్రధాని నరేంద్ర మోడీ! ఐక్యరాజ్యసమితి వేదికగా తానే స్వయంగా ప్రతిపాదించి, నేడు ప్రపంచంలోని 180కి పైగా దేశాలు ఒకే రోజు యోగాసనాలు వేసేలా చేసిన ఘనత మోడీదే. మోడీ హయాంలో యోగా కేవలం ఒక శారీరక వ్యాయామంగా మిగిలిపోలేదు.. అది భారతదేశ 'సాఫ్ట్ పవర్'గా మారింది. 'ఒకే భూమి - ఒకే ఆరోగ్యం' అనే నినాదంతో గ్లోబల్ హెల్త్ కేర్ ఎజెండాలో యోగాను చేర్చారు. ప్రతి ఏటా మోడీ ఇచ్చే యోగా డే 'థీమ్' ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సెట్టర్గా మారుతోంది.
ఒకప్పుడు యోగా అంటే కేవలం మునులు, వృద్ధులకే పరిమితం .. ఒకప్పుడు యోగా అంటే కేవలం కొద్దిమంది సాధువులు, రుషులకు సంబంధించినది అనే భావన ఉండేది. కానీ, 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోడీ దీని రూపురేఖలను మార్చేశారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో జూన్ 21ని 'ఇంటర్నేషనల్ యోగా డే'గా ప్రకటించాలని నరేంద్ర మోడీ ప్రతిపాదించడమే ఒక చరిత్ర. రికార్డు స్థాయిలో 180 దేశాలు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపడం మోడీ దౌత్య విజయానికి నిదర్శనం.
దేశాల సరిహద్దులను దాటేసింది.. ప్రపంచ మానవాళిని ఆరోగ్య సూత్రంతో ఏకం చేసింది! భారతదేశ పురాతన సంస్కృతికి ప్రతీక అయిన యోగా విద్య.. నేడు అంతర్జాతీయ జీవన విధానంగా మారింది. ఈ యోగా దినోత్సవం కేవలం ఒక రోజు వేడుక కాదు...నిరంతర ఆరోగ్య భారత్ శపథం. విశ్వగురు స్థానంలో భారత్ను నిలబెట్టిన అద్భుత శక్తి. శరీరానికి దృఢత్వం.. మనస్సుకు ప్రశాంతత.. ఆత్మకు సంతృప్తినిచ్చే ఏకైక మార్గం యోగా.
కేవలం ఈ యోగాడే రోజున యోగాసనాలు వేయడమే కాకుండా ప్రతినిత్యం మన జీవితంలో భాగం అయ్యేలా చేసుకోవాలి. అపుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనిషి నుంచి సమాజం.. సమాజం నుంచి దేశం ఆరోగ్యంగా ఉంటుంది. మన జీడీపీ కూడా పెరుగుతుంది. ఇలా ప్రపంచ దేశాల ప్రజలు చేస్తే అన్ని రోగాలు మటుమాయం అయి ఆరోగ్యకరమైన ప్రపంచం ఆవిష్కృతం కావడానికి ఎంతో దూరంలో లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.