
కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో 13 రోజులు గడిచినా మిస్టరీ వీడలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలుపెరుగని గాలింపు చర్యలు చేపడుతున్నా ఫలితం లభించలేదు.
ఈ కేసు దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చిన పెంపుడు శునకానికి సంబంధించిన పరిణామాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.కీలకంగా మారిన పెంపుడు శునకంచిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన జూన్ 6వ తేదీనే ఆమెతో పాటే ఉన్న పెంపుడు శునకం కూడా అదృశ్యమైంది. తాజాగా పోలీసులు పరిశీలించిన సీసీటీవీ ఫుటేజ్లో కీలకమైన దృశ్యాలు లభ్యమయ్యాయి.
జూన్ 6న మధ్యాహ్నం 1:02 గంటల సమయంలో ఆ శునకం గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఆలయం వద్ద తీవ్ర ఆందోళనతో అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఆ తర్వాత అది ఎటు వెళ్లిందో స్పష్టత లేదు. అయితే, మూడు రోజుల తర్వాత జూన్ 9న ఆ కుక్క ఇంటికి తిరిగి వచ్చింది.
ఆశ్చర్యకరంగా, అది చిన్నారి వెళ్లిన మార్గంలో కాకుండా మరోవైపు నుంచి రావడం గమనార్హం. ఆ శునకం సహాయంతో పాప జాడ కనుగొనేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవల ఆ కుక్క కూడా మరణించడంతో పోలీసులు పోస్ట్మార్టమ్ నిర్వహించారు.
ఆ నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తుచిన్నారి ఆచూకీ కనుగొనడంలో అన్ని మార్గాలూ అన్వేషిస్తున్న పోలీసులు, కిడ్నాప్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. అటవీ ప్రాంతంలో జీడి పిక్కల