
స్టార్ హీరోయిన్ సమంత నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా విడుదలకు సిద్ధమైన వేళ, చిత్ర బృందం తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకుంది. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.నటి సమంత, ఆమె భర్త, చిత్ర నిర్మాత అయిన రాజ్ నిడిమోరు, దర్శకురాలు నందిని రెడ్డి, నటి-యాంకర్ శ్రీముఖి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఆలయానికి చేరుకున్న చిత్ర బృందానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.నందిని రెడ్డి దర్శకత్వంలో ఫ్యామిలీ యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' చిత్రం రేపు జూన్ 19న (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు చిత్ర విజయం కోసం స్వామివారిని ప్రార్థించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, ప్రమోషన్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి
.