
ఫ్రాన్స్లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ నావికుల భద్రత అంశాన్ని బలంగా ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమైన సందర్భంగా, ఇటీవలే అమెరికా జరిపిన సైనిక దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనను ఆయన పరోక్షంగా గుర్తుచేశారు.
వేలాది మంది భారత నావికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, వారికి తగిన రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా జరుగుతున్న ప్రయత్నాలను ప్రధాని స్వాగతిస్తూనే, అక్కడి ఉద్రిక్తతల కారణంగా భారత పౌరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
"ప్రపంచ వాణిజ్యం కోసం దేశాలను అనుసంధానించే నావికుల భద్రత మనందరి ఉమ్మడి బాధ్యత. సముద్ర వాణిజ్య మార్గాలు సురక్షితంగా ఉండేలా చూస్తూ, వారు ఎటువంటి భయాందోళనలు లేకుండా విధులు నిర్వహించే వాతావరణాన్ని కల్పించాలి" అని మోదీ ఉద్ఘాటించారు.హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధాని పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య త్వరలోనే కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. హర్మూజ్ జలసంధి వద్ద ఎటువంటి ఆంక్షలు ఉండకూడదని, అక్కడ స్వేచ్ఛా వాణిజ్యం నిరంతరాయంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.ఇటీవల ఒమన్ సమీపంలో ఒక వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన సైనిక దాడిలో భారతీయ సిబ్బంది మరణించిన ఘటనపై భారత్ ఇప్పటికే అమెరికాకు దౌత్యపరంగా తన