తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, ఎండల తీవ్రత నుంచి ప్రజలకు ఇప్పుడిప్పుడే ఉపశమనం లభించే సూచనలు కనిపించడం లేదు. జూన్ 20వ తేదీ వరకు రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో పొడి వాతావరణమే నెలకొంటుందని, రానున్న మూడు రోజుల పాటు ఉత్తర, తూర్పు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా నివేదికల ఆధారంగా ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి.బుధవారం ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు నమోదయ్యాయి. ఈ క్రమంలో జూన్ 17, 18, 19 తేదీల్లో ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
గడిచిన 24 గంటల్లో సూర్యాపేట జిల్లా మోతేలో అత్యధికంగా 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఖమ్మం జిల్లా ఏడుపాలెంలో 43.5 డిగ్రీలు, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్లో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు హైదరాబాద్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు హైదరాబాద్, భద్రాచలం మీదుగా ప్రయాణిస్తున్నాయి.
రానున్న 4-5 రోజుల్లో ఇవి రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే, ఉత్తర, మధ్య, తూర్పు జిల్లాల్లో రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించడానికి జూన్ 20-21 వరకు సమయం పట్టవచ్చు.
ఈ లోగా పలుచోట్ల సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో