పల్నాడు జిల్లా రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. పల్నాడు మెట్ట ప్రాంతాల ప్రజల సాగునీటి కల సాకారం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. పల్నాడు రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వరికపూడిశెల ప్రాజెక్టు పైప్లైన్ నెట్వర్క్ పనులను వేగవంతం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగా ప్రాజెక్టు పరిధిలోని భూసేకరణ పనుల కోసం రూ. 63.14 కోట్లు నిధులను కేటాయించింది. వీలైనంత త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని.. క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి మండలాల రూపురేఖలు మారనున్నాయి.
పైప్లైన్ ద్వారా సాగునీటి సరఫరా జరగనుంది. ఈ నేపథ్యంలో వరికపూడిశెల ప్రాజెక్టును నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ట్వీట్ చేశారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న ఆయన.. పల్నాడు జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే వరకు విశ్రమించమని స్పష్టం చేశారు.
పల్నాడు రైతుల కల అయిన వరికపూడిశెల ప్రాజెక్టును నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.ఏంటీ వరికపూడిశెల ప్రాజెక్టు.. మరోవైపు వరికపూడిశెల ప్రాజెక్టు పల్నాడు ప్రజలను దశాబ్దాల నుంచి ఊరిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ నుంచి పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని గంగలకుంట సమీపంలో ఉన్న వరికపూడి వాగు వద్దకు నీటిని ఎత్తిపోస్తారు.
అక్కడి నుంచి పొలాలకు నీరు అందిస్తారు. ప్రాజెక్టులో భాగంగా అడవిలో పైప్ లైన్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఇటీవలే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్(టీవోఆర్) అనుమతులు కూడా మంజూరయ్యాయి. ప్రాజెక్టు పూర్తి అయితే మాచర్ల, కారంపూడి, వెల్దుర్తి, దుర్గి మండలాల్లోని 84,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
నిర్మాణానికి 270.5 హెక్టార్ల మేరకు భూమి అవసరం. అటవీ భూమినే 19.13 హెక్టార్ల మేరకు సేకరించాల్సి ఉంది.
అలాగే నియోజకవర్గంలోని 25 గ్రామాల పరిధిలో ఉన్న 20 వేల మంది దాహార్తి తీరనుంది. మరోవైపు వరికపూడిశెల ప్రాజెక్టుకు సుమారుగా రూ.3227.15 కోట్లు అవుతుందని అంచనా. అలాగే ఈ ప్రాజెక్టు