
దేశంలో నైరుతి రుతుపవనాల పురోగతి మందగించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, వర్షపాతంలో ఏకంగా 40 శాతం లోటు నమోదైంది. జూన్ 4 నుండి జూన్ 17 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సాధారణంగా 65.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 39.7 మిమీ వర్షం మాత్రమే పడింది.
ఇది దేశీయ రైతాంగానికి, ఖరీఫ్ సాగు పనులకు పెద్ద సవాలుగా మారింది.Monsoon Pause: రుతుపవనాలు మాయం..! 64 శాతం తగ్గిన వర్షాలు..! తాజా రిపోర్ట్..!ఇన్శాట్-3డీఎస్ (INSAT-3DS) ఉపగ్రహం అందించిన తాజా చిత్రాలు మరింత కలవరపెడుతున్నాయి. దేశంలోని మధ్య, పశ్చిమ ప్రాంతాల పైన ఆకాశంలో మేఘాల ప్రభావం అసలు లేకపోవడం గమనార్హం.
ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక అంతర్గత ప్రాంతాలు పొడి వాతావరణంతో కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయానికి దట్టంగా కమ్ముకోవాల్సిన మబ్బులు లేకపోవడంతో రుతుపవన శ్రేణి బలహీనపడినట్లు స్పష్టమవుతోంది. అధిక శాతం మేఘాలన్నీ కేవలం బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమయ్యాయి.ఈ వర్షపాత లోటు పలు వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
గుజరాత్లో అత్యధికంగా 98 శాతం వర్షపాత లోటు నమోదు కాగా, మహారాష్ట్రలో 79 శాతం ప్రతికూలత నమోదైంది. అలాగే జార్ఖండ్లో 66 శాతం, ఛత్తీస్గఢ్లో 65 శాతం, మేఘాలయలో 85 శాతం మేర వర్షాలు కురవలేదు. ఈ కేటగిరీలోనే తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, బీహార్, అస్సాం రాష్ట్రాలలో కూడా వానల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.Super El Nino: శతాబ్దంలోనే అత్యంత భారీ ముప్పు..
సిద్దం కావాలంటున్న శాస్త్రవేత్తలు..!జూన్ నెల వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన సమయం. వరి, పత్తి, సోయాబీన్, పప్పుధాన్యాల సాగు ఈ సమయంలోనే ఊపందుకుంటుంది. అయితే వర్షాలు ముఖం చాటేయడంతో భూమిలో తేమ శాతాన్ని ఈ పొడి వాతావరణం దెబ్బతీస్తోంది.
దేశంలో నైరుతి రుతుపవనాల పురోగతి మందగించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, వర్షపాతంలో ఏకంగా 40 శాతం లోటు నమోదైంది. జూన్ 4 నుండి జూన్ 17 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సాధారణంగా 65.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 39.7 మిమీ వర్షం మాత్రమే పడింది. ఇది దేశీయ రైతాంగానికి, ఖరీఫ్ సాగు పనులకు పెద్ద సవాలుగా మారింది.Monsoon Pause: రుతుపవనాలు మాయం..! 64 శాతం తగ్గిన వర్షాలు..! తాజా రిపోర్ట్..!ఇన్శాట్-3డీఎస్ (INSAT-3DS) ఉపగ్రహం అందించిన తాజా చిత్రాలు మరింత కలవరపెడుతున్నాయి. దేశంలోని మధ్య, పశ్చిమ ప్రాంతాల పైన ఆకాశంలో మేఘాల ప్రభావం అసలు లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక అంతర్గత ప్రాంతాలు పొడి వాతావరణంతో కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయానికి దట్టంగా కమ్ముకోవాల్సిన మబ్బులు లేకపోవడంతో రుతుపవన శ్రేణి బలహీనపడినట్లు స్పష్టమవుతోంది. అధిక శాతం మేఘాలన్నీ కేవలం బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమయ్యాయి.ఈ వర్షపాత లోటు పలు వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గుజరాత్‌లో అత్యధికంగా 98 శాతం వర్షపాత లోటు నమోదు కాగా, మహారాష్ట్రలో 79 శాతం ప్రతికూలత నమోదైంది. అలాగే జార్ఖండ్‌లో 66 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 65 శాతం, మేఘాలయలో 85 శాతం మేర వర్షాలు కురవలేదు. ఈ కేటగిరీలోనే తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, బీహార్, అస్సాం రాష్ట్రాలలో కూడా వానల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.Super El Nino: శతాబ్దంలోనే అత్యంత భారీ ముప్పు.. ! సిద్దం కావాలంటున్న శాస్త్రవేత్తలు..!జూన్ నెల వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన సమయం. వరి, పత్తి, సోయాబీన్, పప్పుధాన్యాల సాగు ఈ సమయంలోనే ఊపందుకుంటుంది. అయితే వర్షాలు ముఖం చాటేయడంతో భూమిలో తేమ శాతాన్ని ఈ పొడి వాతావరణం దెబ్బతీస్తోంది. విత్తనాలు వేసే ప్రక్రియ నెమ్మదించింది. అరేబియా సముద్రం నుండి వీచే మారుతాలు బలహీనపడటం, వాతావరణ ఎగువ పొరల్లో గాలుల తీవ్రత కారణంగానే వర్షాలు కురవడం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. రుతుపవనాల పురోగతి దాదాపు ఒక వారంగా స్తంభించిపోవడానికి ఇదే ప్రధాన కారణం.అయితే, జూన్ 21 తర్వాత రుతుపవనాలలో కొంత చలనం వచ్చే అవకాశం ఉందని వాతావరణ అంచనా నమూనాలు సూచిస్తున్నాయి. అరేబియా సముద్రం నుండి తేమతో కూడిన గాలులు మళ్లీ పుంజుకుని, దేశవ్యాప్తంగా వర్షాలు కురిసేందుకు పరిస్థితులు అనుకూలించవచ్చు. ఒకవేళ జూన్ చివరి నాటికి కూడా ఈ లోటు భర్తీ కాకపోతే, దేశీయ వ్యవసాయ రంగానికి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో పాటు ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం పడే ప్రమాదం ఉంది.
విత్తనాలు వేసే ప్రక్రియ నెమ్మదించింది. అరేబియా సముద్రం నుండి