
కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ డిజిటల్ డాక్యుమెంట్ వాలెట్ అయిన 'డిజిలాకర్' మరో కీలక మైలురాయిని అందుకుంది. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఫ్యామిలీ ఐడీ (కుటుంబ గుర్తింపు) కార్డులను తన ప్లాట్ఫామ్లోకి అనుసంధానించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఈ నిర్ణయంతో నాలుగు రాష్ట్రాల్లోని సుమారు 37 కోట్లకు పైగా పౌరులు తమ కీలకమైన కుటుంబ గుర్తింపు పత్రాలను డిజిటల్గా యాక్సెస్ చేసుకోవడం, భద్రపరచడం, అవసరమైన చోట షేర్ చేసుకోవడం వంటివి చేయగలుగుతారు.ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత సులభంగా అందించడం, భౌతిక పత్రాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశం. ఈ అనుసంధానం ద్వారా పౌరులు తమ ఫ్యామిలీ ఐడీలను నేరుగా తమ డిజిలాకర్ ఖాతాలోకి పొందవచ్చు.
ప్రభుత్వ సేవలకు లేదా ధ్రువీకరణ అవసరమైనప్పుడు ఈ డిజిటల్ కాపీని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా అర్హులైన వారు డిజిలాకర్ ప్లాట్ఫామ్ నుంచే కొత్త ఫ్యామిలీ ఐడీ కోసం నమోదు చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించారు.ఏ రాష్ట్రంలో ఏ ఐడీ అందుబాటులోకి వచ్చింది?రాజస్థాన్: రాష్ట్రంలోని సుమారు 7.5 కోట్ల మంది నివాసితులు తమ ‘జన్ ఆధార్’ కార్డును డిజిలాకర్లో యాక్సెస్ చేయవచ్చు.
చిరంజీవి ఆరోగ్య బీమా పథకం, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్), స్కాలర్షిప్లు వంటి అనేక సంక్షేమ పథకాలకు జన్ ఆధార్ తప్పనిసరి.మహారాష్ట్ర: ఇక్కడి సుమారు 14 కోట్ల మంది ప్రజలు తమ ‘మహాసారథి (ఫ్యామిలీ ఐడీ)’ని డిజిలాకర్లో పొందగలరు. ప్రభుత్వ పథకాలు, సేవలను అందించడంలో ఇది ఒక ప్రాథమిక గృహ