
ఉత్తర్ప్రదేశ్లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. పార్కింగ్ ఏరియాలో ఓ కారు తల్లీకూతుళ్లపైకి దూసుకెళ్లింది. దీంతో తల్లీకూతుళ్లు గాయపడ్డారు. నోయిడా, జూన్ 17: ఉత్తర్ప్రదేశ్లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి చోటుచేసుకుంది.
పార్కింగ్ ఏరియాలో ఓ కారు తల్లీకూతుళ్లపైకి దూసుకెళ్లింది. దీంతో తల్లీకూతుళ్లు గాయపడ్డారు. ఆదివారం చోటుచేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ క్రితికా శర్మ సెక్టార్ 79లోని మహాగుణ్ మీరాబెల్లీ సొసైటీలో కుటుంబసభ్యులతో కలిసి ఉంటోంది.
ఆదివారం క్రితికా తన కుటుంబసభ్యులతో కలిసి బేస్మెంట్లోని పార్కింగ్లోకి వెళ్లింది. వారు తమ వాహనంలోని సామాన్లను బయటకు తీస్తున్నారు. ఈ సమయంలో ఓ కారు వేగంగా వారి వైపు దూసుకువచ్చింది. క్రితికా, ఆమె ఐదేళ్ల కూతురు ఆర్యల మీదుగా ముందుకు దూసుకుపోయింది.
ఆర్య స్వల్పగాయాలతో బయటపడగా.. క్రితికాకు తీవ్రగాయాలు అయ్యాయి. కుటుంబసభ్యులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆర్య ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. క్రితికా ఐసీయూలో చికిత్స పొందుతోంది. క్రితికా కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కారు డ్రైవర్ అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు కారు డ్రైవర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో సంక్షేమం లేదు.. ఎక్కడ చూసినా కూల్చివేతలే: కేటీఆర్ బెంగాల్ బ్లాక్బస్టర్ షో.. అన్సంగ్ హీరో మిథున్ చక్రవర్తి