
అమరావతి: పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పురస్కారాలు ‘షైనింగ్ స్టార్స్’. ఈ అవార్డు కార్యక్రమాన్ని జూన్ 29న నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేశ్ తెలిపారు.
విద్యాశాఖ అధికారులతో సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జులై మూడో వారంలో తల్లికి వందనం ఇచ్చే అవకాశముందన్నారు. రాష్ట్రానికి ఎన్సీసీ స్టేట్ యూనిట్ మంజూరైందని చెప్పారు. జూన్ 29న షైనింగ్ స్టార్స్ అవార్డులు: మంత్రి లోకేశ్
|