
పశ్చిమ బెంగాల్ అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. పార్టీకి చెందిన సుమారు 20 మంది లోక్సభ ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వారంతా నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) అనే ఒక చిన్న పార్టీలో విలీనమై, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
జూన్ 14న ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఆయన నివాసంలో కలిసిన ఈ బృందం, తమకు పార్లమెంటులో ప్రత్యేక సీట్లు కేటాయించాలని కోరుతూ ఒక లేఖను సమర్పించింది.టీఎంసీ లోక్సభ పక్షంలోని మొత్తం 28 మంది ఎంపీలలో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మంది ఈ తిరుగుబాటు వర్గంలో ఉండటం గమనార్హం. ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనల నుండి మినహాయింపు పొందేందుకే వారు ఈ విలీన వ్యూహాన్ని అనుసరించారు.
తిరుగుబాటు వర్గానికి నేతృత్వం వహిస్తున్న కాకోలి ఘోష్ దస్తిదార్ మాట్లాడుతూ, తాము ఎన్సీపీఐ అనే గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలో విలీనమయ్యామని, ఇకపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయేతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. సుదీప్ బంద్యోపాధ్యాయ, శతాబ్ది రాయ్, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్తో పాటు సాయోని ఘోష్ వంటి ప్రముఖులు ఈ బృందంలో ఉన్నారు.టీఎంసీ ఎంపీలు ఎన్సీపీఐలో చేరడంతో ప్రస్తుతం ఆ పార్టీ గురించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇప్పటివరకు పెద్దగా ప్రాచుర్యం లేని ఎన్సీపీఐ, ఈ పరిణామంతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చింది.అయితే, ఎన్సీపీఐ పార్టీకి పెద్దగా రాజకీయ చరిత్రగానీ, పటిష్టమైన