
అధికారం, డబ్బు, ప్రతీకారం చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్లకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. అలాంటి అంశాలనే ప్రధానంగా తీసుకుని రూపొందిన తెలుగు వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. సముద్రఖని, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ను సోమవారం హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే క్రైమ్, రాజకీయాలు, ద్రోహాలు, ప్రతీకారంతో నిండిన ఇంటెన్స్ డ్రామాగా ఈ సిరీస్ ఉండబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఏడు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్ ఓ కల్పిత పోర్టు నగరం నేపథ్యంలో సాగుతుంది. అక్కడ నేరాలు, రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ఆశలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.
అధికారాన్ని చేజిక్కించుకునే క్రమంలో పాత్రలు చేసే పోరాటం, తీసుకునే నిర్ణయాలు కథను ముందుకు నడిపిస్తాయి. ప్రతి పాత్రకు ప్రత్యేకమైన లక్ష్యాలు ఉండటంతో కథలో అనేక మలుపులు చోటుచేసుకుంటాయని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.సిరీస్ గురించి దర్శకుడు గ్యారీ బీహెచ్ మాట్లాడుతూ ఇది కల్పిత కథ అయినప్పటికీ ఇందులోని భావోద్వేగాలు ప్రేక్షకులకు దగ్గరగా అనిపిస్తాయని చెప్పారు.
అత్యాశ, ప్రేమ, నష్టం, ప్రతీకారం, అధికారం కోసం తపన వంటి అంశాలు కథలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచే విధంగా కథను తెరకెక్కించినట్లు వెల్లడించారు.ఈ ప్రాజెక్ట్లో తనను ఆకర్షించిన అంశం పాత్రలో ఉన్న సంక్లిష్టతేనని సముద్రఖని చెప్పారు.
తాను పోషించిన నాయుడు పాత్ర గతంలో చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నంగా ఉంటుందని తెలిపారు. మరోవైపు భారతి పాత్రలో నటించిన