US Strike Oman Coast Ship : ఒమన్ గల్ఫ్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతికి కారణమైన వాణిజ్య నౌక ‘ఏటీ సెట్టెబెల్లో’పై అమెరికా సైనిక దాడికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలావు ఫ్లాగ్ కలిగిన ఈ నౌకపై అమెరికా దళాలు విరుచుకుపడటానికి ముందు..
ఏకంగా 60 సార్లు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు కనీసం ఎనిమిది సార్లు సైనిక బలప్రదర్శన చేసినట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ నౌకా సిబ్బంది వాటిని పూర్తిగా బేఖాతరు చేయడంతోనే.. ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.అసలేం జరిగిందంటే..?
అమెరికా రక్షణ నివేదికల ప్రకారం.. సదరు నౌక ఇరాన్ చమురును అక్రమంగా రవాణా చేస్తూ అంతర్జాతీయ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న షాడో ఫ్లీట్లో భాగమని అమెరికా నావికులు గుర్తించారు. గత రెండు వారాలుగా అమెరికా దళాలు ఈ నౌకతో డజన్ల కొద్దీ సార్లు సంప్రదింపులు జరిపాయి.
బుధవారం జరిగిన తుది దాడికి ముందు.. ఫ్లేర్లు విసరడం, యుద్ధ విమానాలతో ఫ్లైఓవర్లు చేయడం వంటి చర్యల ద్వారా హెచ్చరించారు. చివరకు నౌకను నిలిపి వేయడానికి దాని ఇంజన్ రూమ్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధ విమానం ప్రెసిషన్ మునిషన్స్ దాడి చేసింది.
ఈ దాడికి ముందు సిబ్బంది ఇంజన్ రూమ్ నుంచి బయటకు రావడానికి 15 నిమిషాల సమయం ఇచ్చామని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. అయినప్పటికీ నావికులు స్పందించకపోవడం వల్లే.. దాడి చేశామని తెలిపింది. ఈక్రమంలోనే నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా..
ముగ్గురు చనిపోయారని పేర్కొంది. భారత్ తీవ్ర నిరసన..!ఈ ఘటనపై న్యూఢిల్లీ తీవ్రంగా స్పందించింది. తమ సిబ్బంది మృతి పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధిని పిలిపించి భారత్ గట్టిగా నిలదీసింది. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత విదేశాంగ అధికారితో ఫోన్లో మాట్లాడారు.
ఉన్న అమెరికా దిగ్బంధాన్ని ఉల్లంఘించినందుకే ఈ దాడి చేయాల్సి వచ్చిందని సమర్థించుకుంటూనే.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం అంతర్జాతీయ నౌకలన్నీ అమెరికా దళాల ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు.ఈ తీవ్ర ఉద్రిక్తతల మధ్యే పశ్చిమాసియాలో మూడున్నర నెలలుగా సాగుతున్న యుద్ధ వాతావరణానికి తెరదించుతూ ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పర శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. లెబనాన్తో సహా అన్ని దేశాల్లో తక్షణ, శాశ్వత సైనిక చర్యల నిలిపివేతకు ఇరు దేశాలు అంగీకారం కుదుర్చుకున్నాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందం జూన్ 19న స్విట్జర్లాండ్లో అధికారికంగా సంతకం కానుంది.తన 80వ పుట్టినరోజు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. "ఇరాన్తో ఒప్పందం పూర్తయింది. హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నాము. అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని తక్షణమే రద్దు చేస్తున్నాము. ప్రపంచ నౌకలారా.. మీ ఇంజిన్లను స్టార్ట్ చేయండి. చమురును ప్రవహించనివ్వండి" అంటూ ఆయన ప్రకటించారు. ఈ శాంతి ఒప్పందంతో హార్మూజ్ జలసంధిలో రాకపోకలు సాగించే భారతీయ నౌకా సిబ్బందికి చాలా కాలం తర్వాత భారీ ఉపశమనం లభించినట్లయింది.
ఇరాన్ రేవులపై