
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Telangana Govt Schools Breakfast Scheme Telugu News: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ప్రభుత్వ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజీల విద్యార్థులకు ఉచితంగా పోషకాలతో కూడిన అల్పాహారాన్ని అందించే.. బ్రేక్ ఫాస్ట్ పథకం అమల్లోకి రాబోతోంది. విద్యార్థులు ఖాళీ కడుపుతో బడికి రాకూడదనే ఉద్దేశంతో వారి ఆరోగ్యంతో పాటు చదువుపై శ్రద్ధ పెంపొందించేందుకు.. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రభుత్వం రేపటి నుంచి అధికారికంగా ప్రారంభించబోతోంది. అయితే ఈ పథకానికి సంబంధించిన అన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.. తొలి విడతగా 1.44 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి.. ఈ పథకాన్ని విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.. ఇందులో భాగంగా మొదటి విడతలో 8 జిల్లాలను ఎంపిక చేశారు. రేపటి నుంచి ఈ ఎనిమిది జిల్లాల్లో మొత్తం 1269 ప్రభుత్వ పాఠశాలలతో పాటు 33 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ అల్పాహార పథకం అందుబాటులోకి రాబోతోంది. తొలి విడతలోనే దాదాపు 1.44 లక్ష మంది విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం వేడి వేడి బ్రేక్ ఫాస్ట్ అందబోతోంది. రాబోతున్న రోజుల్లో ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలకు విస్తరించి.. మొత్తం 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికల సిద్ధం చేస్తోంది.. నోరూరించే మెనూ.. విద్యార్థులకు కేవలం అల్పాహారం అందించడమే కాకుండా అది రుచికరంగా.. అత్యంత పోషక విలువలతో
కూడుకున్నదిగా.. ఉండేలా ప్రభుత్వం ప్రత్యేకమైన మెనూ రూపొందించింది. ప్రతిరోజు ఒకే రకమైన టిఫిన్ కాకుండా విద్యార్థులంతా ఎంతో ఇష్టంగా తినేలా వివిధ రకాల రుచికరమైన టిఫిన్లను అందుబాటులో ఉంచారు. ఈ మెనూలో ప్రధానంగా వేడివేడి దోశతో పాటు పూరీ, బోండా వంటి అల్పాహారాలు ఉండడం విశేషం. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిల్లెట్ ఇడ్లీతో పాటు కూరగాయలతో తయారుచేసిన ఉప్మా ఇతర పోషక పదార్థాలు అందించే టిఫిన్స్ ఉండడం ఈ మెనూ ప్రత్యేకత..
తల్లిదండ్రుల్లో ఆనందం.. ఉదయాన్నే పనులకు వెళ్లే పేద కుటుంబాల తల్లిదండ్రులకు ఈ పథకం పెద్ద ఊరటనివ్వబోతోంది.. పిల్లలకు పొద్దున్నే వంట చేసే సమయం లేక చాలామంది విద్యార్థులు పరిగడుపునె బడులకు వస్తూ ఉంటారు. ఈ పథకం వల్ల విద్యార్థుల్లో పౌష్టిక ఆహార లోపం తగ్గడమే కాకుండా.. బడులలో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. పాఠశాలల్లో మంచి టిఫిన్ దొరకతుండడంతో అటు విద్యార్థులతో పాటు ఇటు తల్లిదండ్రులు ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న ఈ పథకానికి సంబంధించి అధికారులు అన్ని పాఠశాలల్లో ఇప్పటికే ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేసినట్లు తెలుస్తోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.