
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. What Really Happened in tuni girl missing In 15 Minutes: ఆంధ్రప్రదేశ్ అంతటా సంచలనం సృష్టిస్తున్న తుని చిన్నారి మిస్సింగ్ కేసుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కాకినాడ, తుని అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం సూచించారు. దట్టమైన అడవుల్లో కూడా వెతకడానికి అటవీ శాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ సిబ్బందిని తీసుకుని వెతకాలని ఆదేశించారు. ఈ గాలింపు కోసం సుమారు 400 మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగారు. డ్రోన్ల సహాయంతో, ఇంటి పరిసరాల్లోని 38 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వారం రోజులు గడిచిపోతున్నందున కేసును మరింత వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆ 15 నిమిషాల సమయమే అత్యంత కీలకం... పాపతో పాటు అదృశ్యమైన కుక్క కూడా నిన్న చనిపోవడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ఈ నెల 6వ తేదీన ఈ కేసు నమోదైంది. అయితే ఆ తర్వాత కుక్క తిరిగి వచ్చినప్పుడు దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి కుక్క పాప వద్దకు వెళ్తుందేమో అని అనుకున్నారు.. అయినా ఎటువంటి ఫలితం కనిపించలేదు. నిన్న ఆ కుక్క కూడా చనిపోవడంతో ఒక ఆశ కూడా పోయింది. అయితే, 6వ తేదీ ఉదయం 11:50కి భర్త పాపను భార్యకు ఇచ్చి వెళ్ళాడు. జ్ఞానేశ్వరి మరో పాపను చూస్తూ ఉండటంతో ఆ సమయంలో పాపను గమనించలేకపోయింది. తండ్రి వెళ్ళిన దారిలో ఒక వ్యక్తి పాపను చూసి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా
, కుక్క తనను కరవబోయిందని ఒకరు తెలిపారు. కుటుంబ సభ్యులు వెతికినా పాప దొరకలేదు. మధ్యాహ్నం 12:00-12:15 లోపు పాప కనిపించకుండా పోయిందని పోలీసులు చెబుతున్నారు.
కుక్క అడ్డుకోలేదా? ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది? ఆ అపరిచితులు ఎవరు? కిడ్నాప్ చేసే ప్రయత్నంలో కుక్క అడ్డుకోలేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. పాప కనిపించకుండా పోయిన వెంటనే వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఒక రోజు తర్వాత కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చితే అది కొండ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి ఇంటికే చేరుకుంటోంది. చివరకు నిన్న ఆ కుక్క చనిపోయింది. కొండ ప్రాంతాల్లో తిరగడం వల్ల దానికి అనారోగ్యం వచ్చిందా? లేక ఎవరైనా విషం పెట్టారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం రంగంలోకి దిగడంతో కేసు త్వరగా పరిష్కారం అవుతుందని అందరూ ఆశపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.