
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Railway Alert For Tirumala Devotees: తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుపతికి ప్రయాణిస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది రైళ్లను ఉపయోగించి చేరుకుని అక్కడి నుంచి కొండపైకి వెళ్తారు. అయితే రైల్వేశాఖ తాజాగా కీలక అలర్ట్ జారీ చేసింది.
మౌలిక సదుపాయాల విస్తరణ పనుల కారణంగా తిరుపతి మార్గంలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు ముందుగానే ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించింది. రద్దయిన రైళ్లు, షెడ్యూల్ మార్పులు ఇవే..
చెన్నై సెంట్రల్–తిరుపతి మధ్య నడిచే సప్తగిరి ఎక్స్ప్రెస్ ఈ నెల 26, 28 తేదీల్లో రద్దు చేశారు. ఉదయం 6.30 గంటలు, మధ్యాహ్నం 2.24 గంటల సర్వీసులు కూడా నిలిపివేశారు. 4.35 గంటల ఎక్స్ప్రెస్ 26న రద్దు కాగా, తిరుపతి – చెన్నై సెంట్రల్ ఉదయం 10.10 గంటల రైలు 26, 28 తేదీల్లో రద్దు చేశారు.
అలాగే సాయంత్రం 6.05 గంటల సర్వీస్ కూడా 26న నిలిపివేశారు. అరక్కోణం యార్డ్ విస్తరణ పనుల కారణంగా 47 సబర్బన్ రైళ్లలో మార్పులు జరిగాయి. కొన్ని రైళ్లను మధ్యలోనే షార్ట్ టెర్మినేట్ చేస్తున్నారు. అలాగే బెంగళూరు–గువాహటి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12509) జూన్ 17, 24 తేదీల్లో విజయవాడ, గుడివాడ, నిడదవోలు మార్గంలో దారి మళ్లించారు.
దాదర్–తిరునెల్వేలి ఎక్స్ప్రెస్ కూడా జూన్ 23, 24 తేదీల్లో విరుదు నగర్ వరకు మాత్రమే నడుస్తుంది. ప్రయాణికులు IRCTC వెబ్సైట్లో తాజా షెడ్యూల్ చూడాలని రైల్వేశాఖ సూచించింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్
, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.