
కర్ణాటకలోని ధర్మస్థల వివాదంలో నటుడు ప్రకాష్ రాజ్ పేరు బయటపడటం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. ప్రకాష్ రాజ్ ధర్మస్థల కేసు గురించి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన కన్నడలో ట్వీట్ చేస్తూ
స్పందించారు. ఆ వెధవలు చెప్పే పుకార్లను ఎవరూ నమ్మకండి అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రెండు రోజుల్లో ఎక్స్ప్లోసివ్ ప్రెస్ మీట్ పెట్టి అన్ని నిజాలను బయటపెడతానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన ఈ సున్నితమైన అంశంపై పూర్తి క్లారిటీ ఇస్తానని స్పష్టం చేశారు. ఈ వివాదం బ్యాక్గ్రౌండ్ చూస్తే కర్ణాటకలోని ధర్మస్థలలో 1995 నుండి 2014 మధ్య కాలంలో వందలాది మృతదేహాలను బలవంతంగా ఖననం చేయించారని ఆరోపణలు వచ్చాయి. మహిళలు, పిల్లలతో కూడిన ఈ మృతదేహాల వ్యవహారంపై మాజీ సానిటేషన్ వర్కర్ చిన్నయ్య సంచలన ఆరోపణలు చేశాడు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కూడా జరుగుతోంది. దర్యాప్తులో భాగంగా కొన్ని స్థలాల్లో అస్థిపంజరాలు బయటపడినప్పటికీ ఈ కేసు ఇంకా తీవ్ర కంట్రవర్షియల్గానే కొనసాగుతోంది. దీంతో ఈ వ్యవహారంలోకి నటుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా చేరింది. చిన్నయ్య జూన్ 11న కర్ణాటక హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ప్రకాష్ రాజ్ తనతో తమిళంలో మాట్లాడారని ఆ పిటిషన్లో చిన్నయ్య పేర్కొన్నాడు. భయపడకు, జూలై 29న వచ్చి కౌగిలించుకుంటాను అని ప్రకాష్ రాజ్ తనతో అన్నట్లు చిన్నయ్య ఆరోపించాడు. ఇదిలా ఉండగా ఈ మొత్తం వ్యవహారం ₹200 కోట్ల కుట్రలో భాగమని కూడా చిన్నయ్య కోర్టులో క్లెయిమ్ చేయడం గమనార్హం. ఈ ఆరోపణలు ఫలితంగా సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పుకార్లను నమ్మి తప్పుగా ప్రచారం చేయవద్దని ఆయన కోరారు. ఇదంతా ఒక కుట్రగా భావిస్తున్న ఆయన దీని వెనుక ఉన్న అసలు విషయాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రకాష్ రాజ్ ధర్మస్థల కేసు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్ రాజ్ ప్రకటించినట్లు రెండు రోజుల్లో జరిగే ప్రెస్ మీట్ పైనే అందరి దృష్టి నిలిచింది. ఆయన ఎలాంటి నిజాలు చెప్తారనేది ఆసక్తికరంగా మారింది. కోర్టులో దాఖలైన పిటిషన్ ఆధారంగా మరియు న్యాయస్థానం ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి.