
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న‘స్పిరిట్’ మూవీపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘యానిమల్’ వంటి హిట్ తర్వాత సందీప్
చేస్తున్న ప్రాజెక్ట్ కావడం అందులోనూ ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తుండటంతో.. ఈ సినిమాపై ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎన్నడూ లేనంత హైప్ క్రియేట్ అయింది.
అందుకే అసలు సిసలైన డ్యూటీ చేస్తున్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫుల్ ఫోకస్ పెట్టిన సినిమా ఏదైనా ఉందా? అంటే అది స్పిరిట్ అనే చెప్పాలి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు డార్లింగ్. మామాలుగా అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ సెట్స్లోనే ఎక్కువగా షూటింగ్ జరుపుకున్నాయి. కానీ స్పిరిట్ను మాత్రం రియల్ లొకేషన్స్లో షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ అంతా చుట్టేస్తున్నాడు డార్లింగ్. లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లోని అజీజ్ నగర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రభాస్ ఈ షెడ్యూల్ షూటింగ్లో పాల్గొంటున్నారు. సెట్స్లో ప్రభాస్ అడుగుపెట్టడంతో అక్కడి వాతావరణం అంతా ఒక రేంజ్లో హీటెక్కిపోయిందని సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్సులు చిత్రీకరిస్తున్నట్లు టాక్. అసలు సందీప్ రెడ్డి వంగా మార్క్ రా అండ్ రస్టిక్ ఎలివేషన్స్కు ప్రభాస్ కటౌట్ తోడైతే థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం ఉంటుందో ఊహించుకుంటేనే ఫ్యాన్స్కు పూనకాలు వస్తున్నాయి. కాగా.. 2027 మార్చి 5న స్పిరిట్ భారీ ఎత్తున రిలీజ్ కానుంది.