
ఈ పరిస్థితుల్లో, టాలీవుడ్ దృష్టి ఇప్పుడు రెండో భాగంపైనే ఉంది. ఆగస్ట్ 21న రావాల్సిన నాని చిత్రం ‘ప్యారడైజ్’ మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, ‘విశ్వంభర’ విడుదలపై ఇంకా స్పష్టత లేదు
. ప్రభాస్ ‘ఫౌజీ’ ఈ ఏడాది వచ్చేది కూడా అనుమానాస్పదంగానే ఉంది. దీంతో రెండో సగం ఆశలన్నీ వెంకటేష్, బాలకృష్ణ, రవితేజ, విజయ్ దేవరకొండ చిత్రాలపై నిలిచాయి. వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ దసరాకు షిఫ్ట్ అయింది. బాలకృష్ణ-గోపీచంద్ సినిమా కూడా రానుంది. సెప్టెంబర్ 11న విజయ్ దేవరకొండ ‘రణబాలి’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వీటితో పాటు ‘సంబరాల ఏటిగట్టు’, ‘వృషకర్మ’, ‘నాగబంధం’ వంటి చిత్రాలు కూడా రెండో సగంలో విడుదల కానున్నాయి. ఈ సినిమాల విజయాలపైనే టాలీవుడ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న బయోపిక్స్
ఐమ్యాక్స్ ఐమాక్స్ కోసం ఆ రేట్లు తప్పవా..?
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు