
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు వ్యక్తమవుతున్నాయి. ముజఫరాబాద్, రావల్ కోట్, మీర్పూర్ వంటి నగరాల్లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి పాకిస్తాన్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు వ్యక్తమవుతున్నాయి. ముజఫరాబాద్, రావల్ కోట్, మీర్పూర్ వంటి నగరాల్లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) నేతృత్వంలో జరుగుతున్న ఈ ఆందోళనలను అణచివేయడానికి పాక్ సైన్యం, పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు మరణించారు.