
Janhvi Kapoor Peddi Remuneration: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం 'పెద్ది'. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీసు వద్ద
దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.300 కోట్ల క్లబ్కి చేరిన ఈ చిత్రం.. ఇటీవలే హీరోయిన్ పాత్ర గురించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె పాత్రకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందని విపరీతమైన చర్చ జరుగుతోంది.
రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తున్నప్పటికీ కలెక్షన్ల పరంగా సినిమా అద్భుతంగా రాణిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి.. ఇప్పుడు రూ.400 కోట్లకు చేరువలో ఉంది. ఈ చిత్రం కమర్షియల్గా ఇంత పెద్ద వాణిజ్య విజయం సాధించినప్పటికీ, సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ను చూపించిన తీరుపై ప్రేక్షకుల నుంచి భారీ అభ్యంతరం వ్యక్తమవుతోంది.
సినిమాలో జాన్వీ కపూర్ లుక్ వివాదానికి కారణమైంది. హీరోయిన్లను కేవలం గ్లామర్, వినోద వస్తువులుగా చిత్రీకరించడం చిత్ర పరిశ్రమ ముందుగా ఆపాలని చెబుతూ, నెటిజన్లు సోషల్ మీడియాలో చిత్ర బృందంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ పోషించిన పాత్ర చుట్టూ వివాదాలు ఉన్నప్పటికీ, ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ తన కెరీర్లోనే అత్యధిక పారితోషికం అందుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ సరసన కథానాయికగా నటించినందుకు జాన్వీ కపూర్కు ఏకంగా రూ.8 కోట్లు చెల్లించారట.
జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించిన 'దేవర' సినిమాకు జాన్వీ కపూర్కు రూ.5 కోట్లు చెల్లించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్లో ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా ఆమె తన రెమ్యూనరేషన్ను అమాంతం పెంచేస్తుంది.
'పెద్ది' సినిమా భారీ విజయాన్ని పురస్కరించుకుని జూన్ 8న హైదరాబాద్లో ఒక సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో రామ్ చరణ్, బుచ్చి బాబు సానాతో సహా చిత్ర బృందం మొత్తం పాల్గొంది.
ఇంతటి భారీ విజయోత్సవ కార్యక్రమానికి హీరోయిన్ జాన్వీ కపూర్ హాజరు కాకపోవడం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. తన పాత్రకు సంబంధించిన వివాదం కారణంగా ఆమె ప్రచారానికి దూరంగా ఉన్నారని అంటున్నారు.
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'రాకా' చిత్రంలో జాన్వీ కపూర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి నటిస్తోందని సమాచారం. జాన్వీ ప్రస్తుతం టైగర్ ష్రాఫ్, లక్ష్యలతో కలిసి 'లగ్ జా గలే' అనే హిందీ చిత్రంలో బిజీగా ఉంది. ప్రస్తుతం జాన్వీ దక్షిణాది, ఉత్తరాది చిత్రసీమలలో వార్తల్లో నిలుస్తోంది.