
సాయి సోహన్, విస్మయ శ్రీ , విష్ణు ఓయ్, నరేంద్ర రవి, హరితేజ, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా ఈ రోజు హైదరాబాద్ ఆరె మైసమ్మ టెంపుల్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా
ప్రారంభమైంది. ఈ సినిమాను నిసా ఎంటర్ టైన్ మెంట్స్, సెవెన్ క్రియేషన్స్ బ్యానర్స్ తమ ప్రొడక్షన్ నెం.3 చిత్రంగా నిర్మిస్తున్నాయి. క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు జి.మధుసూధన్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ రోజు జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్స్ అనిల్ – భాను, “రోమాంచికం” చిత్ర దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో
దర్శకుడు జి.మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ – ఈ రోజు మా చిత్ర పూజా కార్యక్రమాలకు అతిథిగా వచ్చి క్లాప్ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, కెమెరా స్విచ్ఛాన్ చేసిన పబ్లిసిటీ డిజైనర్స్ అనిల్ భాను, దర్శకుడు వేణుగోపాల్ రెడ్డికి థ్యాంక్స్. మా సినిమాను క్రైమ్ కామెడీ జానర్ లో మంచి ఎంటర్ టైన్ మెంట్ తో రూపొందిస్తున్నాం. మూవీని ప్రొడక్షన్ వ్యాల్యూస్ లో ఎక్కడా రాజీ పడకుండా నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే మా సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వెల్లడిస్తాం. అన్నారు.