
ప్రపంచ రాజకీయాల్లో శక్తి సమీకరణాలు వేగంగా మారుతున్న ఈ దశలో, భారతదేశం ఒక కీలక వ్యూహాత్మక కేంద్రంగా ఎదుగుతోంది. అమెరికా- భారత్ సంబంధాలు బలపడుతున్న తరుణంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన
తాజా వ్యాఖ్యలు.. అంతర్జాతీయ వేదికపై కొత్త చర్చలకు దారితీశాయి. పుతిన్ స్పష్టంగా చెబుతున్నట్టు ప్రధాని మోడీపై ఒత్తిడి తేవడం అంతర్జాతీయ సంబంధాలకు హానికరం అని ప్రపంచం గ్రహించింది. ఈ కామెంట్లు కేవలం దౌత్యపరమైన మాటలు మాత్రమే కాదు.. ఇవి ప్రపంచ శక్తుల మధ్య జరుగుతున్న మౌన పోరాటానికి ప్రతిబింబంగా తెలుస్తోంది.
పుతిన్ మాటలను ఒకసారి పరిశీలిస్తే.. మోడీపై ఒత్తిడి ప్రపంచ సంబంధాలను దెబ్బతీస్తుందని అంటారాయన. భారత్–రష్యా వాణిజ్యం త్వరలో 100 బిలియన్ డాలర్లను దాటే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, మోడీ మంచి స్నేహితుడు… యూఎస్- ఇండియా వాణిజ్య ఒప్పందం త్వరలో అవుతుందని అంటారు. భారత్ విదేశాంగ విధానం ఎలాంటిదంటే, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి పై అచంచల నిబద్ధత కలిగినది. పాశ్చాత్య ఒత్తిడిని జైశంకర్ ఘాటుగా ఖండించిన మ్యూనిచ్ ఘటన గుర్తుకు వస్తోంది.
భారత్–రష్యా–అమెరికా త్రిభుజ సంబంధాల పరిణామం ఎలాంటిదో విశ్లేషిస్తే.. భారతదేశం శీతల యుద్ధ కాలం నుంచే బహుళ ధ్రువ విదేశాంగ విధానం కలిగిన దేశం. సోవియట్ యూనియన్ పతనం వరకు రష్యా, భారతదేశానికి ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటూ వచ్చింది. 2000 సంవత్సరం తర్వాత అమెరికాతో సంబంధాలు వేగంగా బలపడ్డాయి.
2014 తర్వాత మోడీ ప్రభుత్వం ఇండియా ఫస్ట్ సిద్ధాంతాన్ని మరింత స్పష్టంగా అమలు చేసింది. దీంతో పోల్చి చూస్తే, పుతిన్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రకటనలు కాదు.. అవి భారతదేశం ప్రపంచ శక్తుల మధ్య కీలక స్థానాన్ని పొందినట్లు సూచిస్తున్నాయి.
2014–2020 మధ్య కాలంలో మోడీ- పుతిన్ సంబంధాలు బలపడిన దశ, అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం పెరుగుదల సైతం కనిపించిన కాలమిది. రక్షణ, ఇంధన రంగాల్లో రష్యాతో కీలక ఒప్పందాలు. 2022–2024 ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాల రష్యాపై ఆంక్షలు.. భారత్ రష్యా చమురు దిగుమతులు పెంచడం, పాశ్చాత్య ఒత్తిడి పెరగడం వంటి ఘటనలు నమోదయ్యాయి.
2026లో పుతిన్- మోడీపై ఒత్తిడి హానికరం అనడం, ట్రంప్- యూఎస్, ఇండియా వాణిజ్య ఒప్పందం త్వరలో జరుగుతుందనడం కీలక పరిణామాలు. మ్యూనిచ్ భద్రతా సదస్సులో రూబియో సైతం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇందుకు జైశంకర్ సైతం ఘాటుగా స్పందించారు. భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి ఎప్పటికీ తగ్గదని అన్నారు.
న్యాయపరమైన అంశాలు.. ఆంక్షలు, వాణిజ్య ఒప్పందాలు, అంతర్జాతీయ చట్టం వంటి అంశాల పరిశీలన చేస్తే.. అమెరికా ఆంక్షల విషయం ఒక సారి తరచి చూడాలి. రష్యా ఇంధన రంగంపై అమెరికా విధించిన ఆంక్షలు మూడో దేశాలపై కూడా పరోక్ష ప్రభావం చూపుతాయి. అయితే, అంతర్జాతీయ చట్టం ప్రకారం సార్వభౌమ దేశాలు తమ జాతీయ ప్రయోజనాల ఆధారంగా వాణిజ్య నిర్ణయాలు తీసుకునే హక్కు కలిగి ఉన్నాయి.
ఇక రెండోది భారత్– రష్యా మధ్య వాణిజ్యం వ్యవహారం. 2026 నాటికిది 100 బిలియన్ డాలర్ల లక్ష్యం సాధ్యమని పుతిన్ చెప్పడం, ద్వైపాక్షిక వాణిజ్యానికి ఉన్న చట్టబద్ధతను బలపరుస్తుంది.
మూడో ముఖ్యమైన వ్యవహారం.. యూఎస్–ఇండియా వాణిజ్య ఒప్పందం. ట్రంప్ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ దిశగా చర్చలు కొనసాగుతున్నట్లు సూచిస్తున్నాయి.
ఇందులోని రాజకీయ కోణం ఏంటంటే, శక్తి సమీకరణాల్లో.. భారతదేశం పాత్ర ఎలాంటిది? పుతిన్ వ్యాఖ్యల అసలు అర్థం ఏమిటని పరిశీలిస్తే.. పుతిన్ చేసిన వ్యాఖ్యలు మూడు కీలక సందేశాలను ఇస్తాయి. వాటిలో మొదటిది- భారతదేశం ప్రపంచ రాజకీయాల్లో ఒక స్వతంత్ర శక్తి. ఇక రెండోది- పాశ్చాత్య ఒత్తిడి భారతదేశాన్ని ప్రభావితం చేయలేదని రష్యా నమ్మకం- మూడో ముఖ్యమైన అంశం- మోడీ నాయకత్వం అంతర్జాతీయ వేదికపై ప్రభావవంతమైందని రష్యా అంగీకారం.
అమెరికా కోణంలో చూస్తే.. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా సూచిస్తున్నాయి. అమెరికా భారతదేశాన్ని వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది. చైనా ఎదుగుదలను ఎదుర్కోవడంలో భారత్ కీలకం. వాణిజ్య ఒప్పందం ద్వారా ఆర్థిక బంధాలను బలపరచాలనే ఉద్దేశం.
పాశ్చాత్య మీడియా.. ఏమంటుందంటే, భారత్- రష్యా చమురు కొనుగోలుపై విమర్శాత్మక దృక్కోణం కలిగి ఉంది. ఇక భారత మీడియా పాయింటాఫ్ వ్యూలో చూస్తే, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని రక్షించే జైశంకర్ వైఖరికి మద్దతు ఇస్తోంది. రష్యా మీడియా సంగతికి వస్తే, భారత్ను విశ్వసనీయ భాగస్వామి గా చూస్తోంది. ఇక ఇందులోని సామాజిక ప్రభావం ఎలాంటిదో పరిశీలిస్తే.. భారతదేశంలో ప్రజాభిప్రాయం ప్రకారం మాట్లాడితే, స్వతంత్ర విదేశాంగ విధానానికి విస్తృత మద్దతు ఇస్తోంది. ఫైనల్ గా ప్రపంచమంతా ప్రస్తుతం భారత్ను బ్యాలెన్సింగ్ పవర్ గా గుర్తిస్తోంది.
భారత్–రష్యా వాణిజ్యం- 100 బిలియన్ డాలర్ల దిశగా దూసుకెళ్తోంది. పుతిన్ వాదన ప్రకారం.. భారత్-రష్యా వాణిజ్యం త్వరలో 100 బిలియన్ డాలర్లను చేరుకుంటుంది. ఇది కేవలం సంఖ్య కాదు. ఇది మూడు రంగాల్లో భారీ విస్తరణకు సంకేతం. ఇంధన రంగం అంటే, చమురు, గ్యాస్- దీంతో పాటు రక్షణ రంగం అణుశక్తి, అంతరిక్ష, మౌలిక వసతులు వంటివి.
ఇది ప్రపంచ శక్తి సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతోందంటే, భారత్ ఇప్పుడు.. అమెరికా–రష్యా మధ్య సమతుల్య సంబంధాలు కొనసాగిస్తున్న ఏకైక ప్రధాన శక్తిగా కనిపిస్తోంది. చైనా ఎదుగుదల నేపథ్యంలో కీలక వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటోంది భారత్- అంతే కాదు గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహిస్తున్న దేశంగానూ మారింది భారత దేశం
భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను ముందుకు పెట్టడం పట్ల.. విస్తృత మద్దతు లభిస్తోంది. పాశ్చాత్య ఒత్తిడిని ఎదుర్కొనే భారత వైఖరిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మోడీ–పుతిన్–ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మొత్తంగా సారాంశమేంటంటే, భారతదేశం- స్వతంత్ర శక్తి, స్వతంత్ర నిర్ణయాలు ప్రస్తుతం హాట్ టాపిగ్గా మారింది. పుతిన్ వ్యాఖ్యలు, ట్రంప్ ప్రశంసలు, జైశంకర్ ఘాటైన ప్రతిస్పందన.. ఇవి అన్నీ ఒకే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. భారతదేశం ఇకపై ఎవరి శిబిరంలోనూ ఉండే దేశం కాదు. తన స్వంత శిబిరాన్ని నిర్మించుకునే శక్తిగా ఎదిగింది. అంతర్జాతీయ సంబంధాల్లో భారత్ ఇప్పుడు రూల్ టేకర్ కాదు- రూల్ మేకర్.
అమెరికా.. పది లక్షల కొనుగోలుదారులను ఎలా కోల్పోయిందంటే!?
టీఎంసీలో ఉద్ధవ్ మోడల్?.. మమత కన్నీటి చుక్కల వెనక సత్యమేంటి?
.