మూడు సార్లు కౌన్సెలింగ్ తీసుకున్న తర్వాత కూడా ఆ జంట ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. రాజీకి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇద్దరూ తమ మనసు మార్చుకోవడానికి నిరాకరించారు. చివరికి, ఎలాంటి పరిష్కారం
దొరక్కుండానే ఆ విషయం మిగిలిపోయింది.
విడిపోవాలనే తమ నిర్ణయంపై ఆ జంట దృఢంగా నిలబడింది.ఈ ఘటన ఇప్పుడు వ్యక్తిగత అంచనాలు, కుటుంబ జోక్యం, సంబంధాలలో పరస్పర అవగాహన ప్రాముఖ్యత వంటి విషయాలపై చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన నేర్పే పాఠాలేంటో చుద్దాం.
పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన వారు ఒకరినొకరు అర్థం చేసుకునే తంతు. హనీమూన్ అనేది కేవలం విహారయాత్ర కాదు. పెళ్లి హడావుడి, అలసట నుంచి దూరంగా ఉంటూ, ఎలాంటి ఒత్తిడి లేకుండా భాగస్వామితో 'క్వాలిటీ టైమ్' గడపడానికి దొరికే మొదటి అవకాశం. అక్కడ కుటుంబ సభ్యులు ఉంటే, కొత్తగా వచ్చిన భాగస్వామి ఫ్రీగా మాట్లాడటానికి, తన భావాలను పంచుకోవడానికి సంకోచిస్తారు.
ఏ భర్తకైనా కుటుంబం పట్ల బాధ్యత, ప్రేమ ఉండటం మంచిదే. కానీ భార్యభర్తల వ్యక్తిగత జీవితానికి ఎంతవరకు హద్దులు ఉండాలనే స్పష్టత పెళ్లైన కొత్తలోనే ఉండాలి. సాంప్రదాయాల పేరిటో లేదా అందరి సంతోషం కోసమనో భార్య కనీస వ్యక్తిగత స్వేచ్ఛను కూడా పక్కనపెడితే.. అది బంధంలో గొడవలకు అభద్రతాభావానికి దారితీస్తుంది. అందుకే భార్యకు కనీసం స్పేస్ ఇవ్వాల్సిన బాధ్యత భర్తదే.
భార్యభర్తలు ఏదైనా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు భాగస్వామి ఇష్టాయిష్టాల్ని తెలుసుకోవడం కనీస బాధ్యత. "నేను అందరి సంతోషం కోసమే చేశాను, నా నిర్ణయమే కరెక్ట్" అనే మొండి వైఖరి (ముఖ్యంగా ఈ కేసులో భర్త చూపించినట్లు) బంధాన్ని ముంచేస్తుంది. 'నేను' అనే ఆలోచన నుంచి 'మనం' అనే ఆలోచన వైపు మారడమే వైవాహిక జీవితంలో మొదటి మెట్టు. భార్యను అడిగి ఈ నిర్ణయం తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉండేదని మానసిక నిపుణులు అంటున్నారు.
ఏ బంధంలోనైనా ఓపెన్ కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. పెళ్లికి ముందే ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు, ప్రాధాన్యతలు, వ్యక్తిగత స్పేస్ గురించి ఒకరికొకరు స్పష్టత ఇచ్చుకోవాలి. చదువు, కెరీర్ ఎంత ముఖ్యమో, ఒకరి భావాల్ని మరొకరి గౌరవించుకోవడం కూడా అంతే ముఖ్యం. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే భార్యభర్తలు ఎంత చదువుకున్నవారైనా సరే చిన్న విషయాలకే బంధాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా బంధంలో రోజూ గొడవలకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. అందుకే ఓపెన్ కమ్యూనికేషన్ చాలా ముఖ్యం.
గమనిక ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.
రచయిత గురించిపుత్తా శ్రీధర్ రెడ్డిశ్రీధర్ రెడ్డి పుత్తా సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 8 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2024లో సమయం తెలుగులో చేరిన శ్రీధర్ రెడ్డి లైఫ్స్టైల్కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై విస్తృతమైన వార్తల్ని అందించారు. తాను ఈ విభాగాల్లో 1300కి పైగా ఆర్టికల్స్ను ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యే సరళమైన భాషలో రాస్తారు. శ్రీధర్ రెడ్డి పుత్తా 2018లో రచనా జర్నలిజం స్కూల్లో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ న్యూస్ ఛానెల్లో (22.10.2018 నుంచి 18.11.2020 వరకు) సబ్ ఎడిటర్గా పనిచేశారు. ఆ సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్ వార్తలు రాశారు. ముఖ్యంగా స్పోర్ట్స్ బులిటెన్ను చూసుకునేవారు. ఆ తర్వాత న్యూస్18 తెలుగు వెబ్సైట్లో (30.10.2020 నుంచి 19.09.2024 వరకు) పనిచేశారు. ఈ సమయంలో న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్ వార్తలతో పాటు స్పోర్ట్స్, బిజినెస్, టెక్నాలజీ న్యూస్ రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి