
Rajya Sabha Elections: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికల సంఘం (ఈసీ) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది
. రాజ్యసభ సభ్యులుగా భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్, లింగమనేని రమేష్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నామినేషన్ల పరిశీలన అనంతరం ఇతర అభ్యర్థులు ఎవరూ పోటీలో లేకపోవడంతో ఎన్నిక అవసరం లేకుండానే వీరి ఎన్నిక ఖరారైంది. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణకు నిర్ణయించిన గడువు ముగియడంతో, మిగిలిన అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలు భర్తీ అయ్యాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులు త్వరలోనే రాజ్యసభ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరి ఎన్నికపై ఆయా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.