మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో
థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుంచే అద్భుతమైన టాక్ను సొంతం చేసుకుని రికార్డుల వేటను కొనసాగిస్తోంది. సుకుమార్ రైటింగ్స్, జియో స్టూడియోస్ సమర్పణంలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన ఈ చిత్రానికి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే సరికొత్త చరిత్రను లిఖించింది.రూ.300 కోట్ల క్లబ్లోకి మెగా ఎంట్రీబాక్సాఫీస్ వద్ద తిరుగులేని ‘ఛాంపియన్’గా నిలిచిన ‘పెద్ది’ చిత్రం కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 315 కోట్లకు పైగా అద్భుతమైన గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. రామ్ చరణ్ కెరీర్లోనే అత్యంత వేగంగా రూ. 300 కోట్ల క్లబ్లో చేరిన సోలో చిత్రంగా ‘పెద్ది’ సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పటివరకు విడుదలైన చరణ్ సోలో చిత్రాల్లో ఇదే అత్యంత భారీ వసూళ్లు కావడం విశేషం. గ్రామీణ నేపథ్యం ఉన్న కథనం, క్రీడా స్ఫూర్తి, అన్నింటికీ మించి రామ్ చరణ్ నట విశ్వరూపం మాస్ ఆడియన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్ల వైపు భారీగా ఆకర్షిస్తున్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, కన్నడ స్టార్ హీరో శివ రాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ పోషించిన కీలక పాత్రలు సినిమాకు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, రత్నవేలు విజువల్స్ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్స్లో సెన్సేషన్థియేటర్లలోనే కాకుండా డిజిటల్ బుకింగ్స్ ప్లాట్ఫామ్స్లో కూడా ‘పెద్ది’ సంచలనాలు నమోదు చేస్తోంది. మేకర్స్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. కేవలం ‘Book My Show’ మరియు ‘District’ యాప్స్ ద్వారానే ఏకంగా 5.3 మిలియన్లకు (53 లక్షలు) పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ స్థాయి బుకింగ్స్ రామ్ చరణ్కు ఉన్న తిరుగులేని మాస్ ఫాలోయింగ్కు మరియు సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్కు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీక్డేస్లో కూడా ఈ బుకింగ్స్ స్టెడీగా కొనసాగుతుండటం విశేషం.నార్త్ ఆడియన్స్ కోసం క్రేజీ ఆఫర్బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే తిరుగులేని వసూళ్లు సాధిస్తున్నప్పటికీ, మేకర్స్ ప్రేక్షకులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించిన చిత్ర బృందం, అక్కడి ఫ్యామిలీ ఆడియన్స్ను మరింతగా థియేటర్లకు రప్పించేందుకు ఒక కీలక వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం ఒక్క రోజు నార్త్ ఇండియాలోని ఎంపిక చేసిన కొన్ని ప్రధాన థియేటర్లలో ‘పెద్ది’ టికెట్ ధరను కేవలం రూ. 199లకే అందుబాటులోకి తీసుకువచ్చారు. సాధారణంగా ఇంత పెద్ద స్టార్ సినిమాలకు ప్రారంభ రోజుల్లో టికెట్ ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. కానీ సినిమాను మరింత మంది సామాన్య ప్రేక్షకులకు చేరవేయాలనే ఉద్దేశంతో మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సినీ వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా పలు బాలీవుడ్ చిత్రాలు ఇలాంటి స్ట్రాటజీలతో సక్సెస్ సాధించాయి. ఇప్పుడు రామ్ చరణ్కు నార్త్ మార్కెట్లో పెరుగుతున్న భారీ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు, లాంగ్ రన్ లో ‘పెద్ది’ కలెక్షన్ల జోరును మరింత పెంచేందుకు ఈ వ్యూహం ఎంతగానో ఉపయోగపడుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆఫర్ వల్ల వీక్డేస్లో కూడా నార్త్ బెల్ట్లో వసూళ్లు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.