రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ లోనే సుమారు రూ.300 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. అయితే రిలీజైన వెంటనే ఈ సినిమా పైరసీ వెబ్
సైట్లలో దర్శనం ఇవ్వడం షాకింగ్ గా మారింది. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదలైతే, అదే రోజు హై క్వాలిటీతో పైరసీ ప్రింట్ బయటకు వచ్చింది. వీటిపై అభిమానులు రిపోర్ట్స్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికీ పలు సైట్లలో ఈ చిత్రం అందుబాటులో ఉంది. దీనిపై బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.ఫ్యామిలీతో కలిసి ‘పెద్ది’ సినిమా చూశానని చెప్పిన బొలిశెట్టి సత్యనారాయణ.. విడుదలైన వెంటనే ఈ మూవీ పైరసీ వెబ్సైట్లలో ప్రత్యక్షం కావడం బాధాకరమని అన్నారు. కొత్త సినిమాలు ఇలా నెట్లో ఫ్రీగా అందుబాటులో ఉండడం వల్ల కేవలం నిర్మాతలకి మాత్రమే కాదు, ప్రభుత్వానికి కూడా తీరని నష్టం అని ఆయన పేర్కొన్నారు. పైరసీని అరికట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ మేరకు బొలిశెట్టి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ.. 'పెద్ది' మూవీకి సంబంధించిన పైరసీ లింక్ ను కూడా ఆయన షేర్ చేశారు. “నేను ఈరోజు కుటుంబ సమేతంగా పెద్ది సినిమా చూడడం జరిగింది. నా సినిమా టికెట్స్ స్క్రీన్ షాట్ క్లోజ్ చేసా.. ఈ సినిమా నెట్లో ఫ్రీగా అందుబాటులో ఉండడం కేవలం ప్రొడ్యూసర్ కి మాత్రమే కాదు, ప్రభుత్వానికి కూడా తీరని నష్టం. దీన్ని అరికట్టే బాధ్యత మన కూటమి ప్రభుత్వానికి ఉంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ గారికి, హోం మినిస్టర్ గారికి ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా దీనిపై దృష్టి సారించి సత్వరం ఈ మూవీని ఆన్లైన్లో నుంచి తొలగిస్తారని ఆశిస్తున్నాను” అని బొలిశెట్టి పోస్టులో పేర్కొన్నారు.* ‘పెద్ది’కి ఊహించని షాక్.. అట్రాసిటీ కేసు పెట్టాలని గిరిజన సంఘాల డిమాండ్“పెద్ది సినిమా ఒక కథ కాదు.. దేశంలో ఇంకా మౌలిక సదుపాయాల కోసం పోరాడుతున్న 18 వేల గ్రామాల వాస్తవం. సాధారణ ప్రజల గొంతును వ్యవస్థ పట్టించుకోనప్పుడు, తమ ఉనికి కోసం పోరాటమే మార్గమవుతుందని ఈ చిత్రం చెబుతుంది. పేరు, గుర్తింపు, అభివృద్ధి అడుక్కునే భిక్ష కాదు.. ప్రతి పౌరుడి హక్కు. అలాంటి సామాజిక సందేశంతో వచ్చిన సినిమా విడుదలైన వెంటనే పైరసీ వెబ్సైట్లలో ప్రత్యక్షం కావడం బాధాకరం. సినిమా పైరసీ వినోదం కాదు... అది దొంగతనం. అది నిర్మాతల పెట్టుబడిని, సినీ కార్మికుల ఉపాధిని, ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటుంది. ప్రభుత్వ పన్ను రాబడికి భారీ నష్టాలను కలుగజేస్తుంది”“తెలుగు సినిమా ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న ఈ సమయంలో, ఇలాంటి పైరసీ వెబ్సైట్లపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. తీసుకున్న చర్యలను ప్రజలకు వెల్లడించాలి. ప్రతి సినిమా వెనుక ఉన్న కష్టాన్ని, సృజనాత్మకతను, పెట్టుబడిని చట్టవిరుద్ధ వేదికలు దెబ్బతీయడాన్ని మనం అనుమతించలేము. పైరసీని అరికట్టండి. భారతీయ సినిమాను కాపాడండి. ఉపాధిని కాపాడండి” అని బొలిశెట్టి సత్యనారాయణ రాసుకొచ్చారు. దీనికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్, మంత్రులు కందుల దుర్గేష్, అనిత, ఏపీ పోలీస్ తో పాటుగా రామ్ చరణ్, ఉపాసన, చిరంజీవిలను ట్యాగ్ చేశారు.* ‘పెద్ది’ థాంక్యూ మీట్.. మీసం మెలేసిన రామ్ చరణ్అంతకముందు బొలిశెట్టి పోస్ట్ చేస్తూ.. “నా మనవడు ఆర్యా రామ్ చరణ్ని విలన్లు కొట్టారని నిన్న రాత్రి కంప్లైంట్ చేశాడు. వాళ్లను ఈరోజే వెళ్లి కొట్టాలని పట్టుబట్టాడు. ‘వాళ్ళెక్కడ?’ అని అడిగితే, ‘థియేటర్లో ఉన్నారు’ అని చెప్పాడు. సరే వెళ్తానులే అని వాడికి మాటిచ్చాను!. ఇప్పుడు ఒక తాతయ్య నా కర్తవ్యం పెద్ది సినిమా థియేటర్ కి వెళ్లి విలన్లని కొట్టాలి. పర్యావరణ పరిరక్షణ పనుల వల్ల 'పెద్ది' సినిమా ప్రీవ్యూ చూడలేకపోయాను. కానీ నా మనవడు ఆర్యా ఇచ్చిన 'మిషన్' పూర్తి చేయడానికి, ఈరోజు సినిమా తప్పకుండా చూడాలి, లేదంటే నా మనవడు ఒప్పుకోడు” అని పేర్కొన్నారు. అన్నట్టుగానే కుటుంబంతో కలిసి ‘పెద్ది’ సినిమా చూసి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. పైరసీని అరికట్టాలని పిలుపునిచ్చారు. అయితే పైరసీ లింక్ షేర్ చేయడం వల్ల మరింతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' సినిమా తెరకెక్కింది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు ఈ పాన్ ఇండియా చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.