బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పెద్ది’. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు
నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబడుతోంది. 4 రోజుల్లోనే రూ.292 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ సినిమాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు.‘పెద్ది’ చిత్ర బృందం సోమవారం హైదరాబాద్ లో థాంక్యూ ప్రెస్ మీట్ను నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ... “ఈ సినిమాను ఇంత ఘన విజయం చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఒక మంచి కథను చెప్పాలనే ఉద్దేశంతో నేను, చరణ్ మీ ముందుకు వచ్చాం. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఐదు పాటలు, ఐదు ఫైట్లు ఉండే చిత్రం కాదు. ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ.. పెద్దిగాడి ఇన్స్పిరేషనల్ జర్నీ. 2017-18లో ప్రధానమంత్రి మోదీ ‘ఖేలో ఇండియా’ అనే ప్రోగ్రామ్ పెట్టారు. ఇంటింటికి వెళ్లి ఓటు అడిగినట్లే, ఇంటింటికి వెళ్లి ఆటగాళ్లను తీసుకొచ్చి దేశానికి పరిచయం చేద్దామని ఆ కార్యక్రమం తీసుకొచ్చారు. దాన్ని నేను ఒక స్ఫూర్తిగా తీసుకున్నాను” అని అన్నారు.* నెట్లో ఫ్రీగా ‘పెద్ది’ మూవీ అందుబాటులో ఉంది.. దీన్ని అరికట్టే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే: బొలిశెట్టి“ఖేలో ఇండియా’ గురించి నేనూ, చరణ్ సార్ కూడా మాట్లాడుకున్నాం. పెద్ది సినిమాలో ఒక నెగెటివ్ మైండ్ సెట్ తో బోమన్ ఇరానీ క్యారెక్టర్ మొదలవుతుంది. ఈ గ్రామస్తులా ఇండియాకి మెడల్స్ తీసుకొచ్చేది అనుకుంటాడు. కానీ గ్రామాల్లో ఉన్న యువకులు తలచుకుంటే దేశానికి పతకాలు తీసుకురాగలరని అది నిరూపించింది. గ్రామాల్లో 150 - 200 కేజీలు మూటలు అవలీలగా మోసే వ్యక్తి, ఇక్కడ ఉండటం వల్ల కూలోడు అయ్యాడు. అదే జాతీయ స్థాయిలో వెళ్లి ఉంటే హెవీ వెయిట్ ఛాంపియన్ అవుతాడని నేను నమ్మాను. ఊర్లో అలాంటి వాళ్లని చూసి, ఒలిపిక్స్ కి వెళ్తే మెడల్స్ తీసుకొస్తారని నేను ఫీల్ అయ్యేవాడిని”“భారతీయ జీవన విధానంలోనే ఆట ఒక భాగం అని ఈ సినిమాలో చెప్పాలని అనుకున్నాను. ఒక వ్యవస్థలో మనిషికి గుర్తింపు ఎంత ముఖ్యమో చెప్పాలనుకున్నాం. తన ఊరి కోసం, తన గుర్తింపు కోసం ఒక వ్యక్తి ఎంత పోరాడతాడు అనేదే ఈ కథ. ఈ దేశంలో ఇప్పటికీ గుర్తింపు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. దాదాపు 18 వేల గ్రామాలు అలాంటి పరిస్థితిలో ఉన్నాయని నేను చదివాను. అలాంటి గ్రామాలన్నింటినీ భాగం చేయాలనే ఒక ప్రయత్నం చేశాను. ఇలాంటి ప్రయత్నానికి రామ్ చరణ్ ముందుండి సపోర్ట్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ కథను నేను ఎంతగా నమ్మానో, చరణ్ గారు కూడా అంతే నమ్మారు. దానికి ఫలితమే గత నాలుగు రోజులుగా వస్తున్న అభినందనలు, ప్రశంసలు”“చాలా మంది ‘మంచి సినిమా తీశారు’, ‘రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది’ అని మెసేజ్లు పెడుతున్నారు. అప్పలసూరి పాత్ర ఈ సినిమాకు చాలా ఇంపార్టెంట్. జగపతిబాబు అద్భుతమైన నటన కనబరిచారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులు చివరి నాలుగు నిమిషాల్లో చాలా ఎమోషనల్ అవుతున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నేను ఏది ఫీల్ అయ్యానో అదే జరిగింది. హాస్పిటల్ సీన్ దగ్గర లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. చాలామంది నేషనల్ అవార్డు వస్తుందని అంటున్నారు. ఒక దర్శకుడిగా అంతకంటే పెద్ద ఆనందం ఉండదు. నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత సతీష్ కి జీవితాంతం రుణపడి ఉంటాను. హాలిడేస్లో అమ్మమ్మ ఇంటికి వెళ్లినట్లు, ‘పెద్ది’ ఆడుతున్న థియేటర్లకు కూడా వెళ్లి సినిమా చూడండి” అని బుచ్చిబాబు చెప్పుకొచ్చారు.పెద్ది థ్యాంక్యూ మీట్ లో బుచ్చిబాబు మాట్లాడిన వీడియోని బండి సంజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దూరదృష్టితో కూడిన ‘ఖేలో ఇండియా’ క్యాంపెయిన్ స్ఫూర్తితో.. క్రీడలలో రాణిస్తున్న మన యువత స్ఫూర్తిని ‘పెద్ది’ సినిమా అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని బిగ్ స్క్రీన్ పైకి తీసుకువచ్చిన చిత్ర బృందానికి అభినందనలు” అని ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు. దీనికి మోదీ, రామ్ చరణ్ లను ట్యాగ్ చేశారు. బీజేపీ తెలంగాణ ఎక్స్ హ్యాండిల్ కూడా బుచ్చిబాబు స్పీచ్ ను షేర్ చేసుకుంది.* ‘పెద్ది’ థాంక్యూ మీట్.. మీసం మెలేసిన రామ్ చరణ్నిజానికి ‘పెద్ది’ సినిమాకి బీజేపీ పార్టీ, నాయకులు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఈవెంట్ లో రామ్ చరణ్ గతంలో నరేంద్ర మోదీ తనను పెద్ది కథ గురించి అడిగారని, అప్పుడు ఆయన ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పారని వెల్లడించారు. ఈ వీడియోని భారతీయ జనతా పార్టీ లీడర్స్ దగ్గర నుంచి కార్యకర్తల వరకూ అందరూ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకున్నారు. ఇప్పుడు థ్యాంక్యూ మీట్ లో ‘పెద్ది’ సినిమాకి మోదీ ఆలోచన నుంచి వచ్చిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం స్పూర్తిగా నిలిచిందని చెప్పడంతో.. బండి సంజయ్ పోస్ట్ పెట్టారు. ఇది నెట్టింట వైరల్ అవుతోంది.