రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబడుతోంది. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.292 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్
అధికారికంగా ప్రకటించారు. ఈరోజుతో మైల్ స్టోన్ రూ.300 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా, సోమవారం హైదరాబాద్లో థాంక్యూ మీట్ నిర్వహించారు. రామ్ చరణ్, జగపతి బాబు, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు సతీశ్ కిలారు, మైత్రీ రవిశంకర్, లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 'పెద్ది' తన కెరీర్ లో, తన లైబ్రరీలో నెం. 1 లేదా 2 గా నిలిచిపోయే సినిమా అని చరణ్ పేర్కొన్నారు.‘పెద్ది’ థాంక్యూ మీట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''ఎలా మాట్లాడాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. నిన్న సినిమా చూడకపోయి ఉంటే నేను ఇంకా బెటర్ గా మాట్లాడేవాడిని. మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు, అభిమానులు అందరికీ మనస్ఫూర్తిగా థాంక్యూ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నాకు నచ్చిన పని, నేను ఇష్టపడి ప్రేమిస్తూ చేసిన ఈ పనికి ఇంత ప్రేమని పొందడం చాలా సంతోషంగా ఉంది. ఎవరో నన్ను పుష్ చేసి ఈ పని చేయాలని, లేకపోతే ఈ దారిలో వెళ్లాలని నాకు చెప్పలేదు. నేను స్వతహాగా అనుకొని, బుచ్చి అనే డైరెక్టర్ ని, తన కథని నమ్ముకొని ఈ సినిమా చేసినందుకు ఎంతో సంతృప్తిగా ఉంది. ప్రేక్షకులకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అని అన్నారు.* మోదీ ‘ఖేలో ఇండియా’ స్ఫూర్తితోనే ‘పెద్ది’.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంసలు''చాలా రోజుల తర్వాత ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూశాను. అక్కడ మాస్ థియేటర్కు వచ్చేంత రియాక్షన్ కనిపించింది. నేను ఊహించని సన్నివేశాలకు కూడా చప్పట్లు కొట్టారు. సినిమా చాలా ఇన్స్పైరింగ్గా ఉందని చెబుతున్నారు. అలాంటి అనుభూతిని నాకు కలిగించిన మా టీమ్ అందరికీ థ్యాంక్స్. నా సినీ కెరీర్ లో, నా లైబ్రరీలో నెంబర్ 1, 2 గా నిలిచిపోయే సినిమా ఇది. మొదటిసారి కథ విన్నప్పుడు బుచ్చిని హగ్ చేసుకున్నాను. కానీ ఇది ఎంత రిస్క్ తో కూడిన కథ అనేది తర్వాత తెలిసింది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే, వాళ్లు ఈ సినిమాను స్వీకరించిన తీరు చూస్తుంటే, ఎవరైనా మనస్ఫూర్తిగా, నిజాయితీగా పని చేస్తే అది రేజర్ ఎడ్జ్ సినిమా అయినా, కమర్షియల్ సేఫ్ జోన్ సినిమా అయినా.. తప్పకుండా హిట్ కావాల్సిందే. అలాంటి సక్సెస్ అందించిన భారతదేశంలోని, విదేశాల్లోని ప్రతి ప్రేక్షకుడికి ధన్యవాదాలు. కుర్రాళ్లు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు ఇలా అన్ని వర్గాల వారు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు''''జగపతిబాబుని సినిమాలో చూస్తున్నప్పుడు నా కళ్లలో నీళ్లు వచ్చాయి. అంత అద్భుతంగా, అంత ఇన్స్పైరింగ్గా ఆయన పాత్రను పోషించారు. అలాగే శివరాజ్ కుమార్, మిగతా నటీనటులందరికీ థ్యాంక్స్. మేమంతా చాలా కష్టపడి, ఇష్టపడి ఈ సినిమా చేశాం. రెహమాన్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మా పెర్ఫార్మెన్స్లను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. నిర్మాత సతీష్ కి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత భారీ బడ్జెట్, ఇంత పెద్ద సబ్జెక్ట్ అయినా ఒక్కరోజు కూడా ఎలాంటి ఒత్తిడి తెలియనివ్వకుండా ఎంతో హ్యాపీగా సినిమా చేశారు. 185 రోజుల షూటింగ్లో, దాదాపు 165 రోజులు మా వెంటే ఉన్నారు. ఆయనకు థ్యాంక్యూ సో మచ్. అనంత శ్రీరామ్ రాసిన పాటలు జీవితాంతం నా ప్లే-లిస్ట్లో ఉంటాయి. అంత ఇన్స్పైరింగ్ లిరిక్స్ రాశారు. 'పెద్ది' లాంటి సినిమాకు నిజాయితీ అవసరం. ఆడియన్స్ కూడా నిజాయితీగా థియేటర్కు రావాలంటే, మేము నిజాయితీగా పని చేయాలి. మా సినిమా కోసం అంత నిజాయితీగా పనిచేసిన అందరికీ ధన్యవాదాలు'' అని చరణ్ అన్నారు. ఈ సందర్భంగా యాంకర్ స్రవంతి చొక్కారపు కోరిక మేరకు చరణ్ మీసం మెలేసి అభిమానులను ఉత్సాహ పరిచారు.* ‘పెద్ది’లో ఏమీ లేదన్నారు.. ఎక్కువ మాట్లాడేసానా అని భయపడ్డాను: జగపతిబాబు