
Chandrababu Naidu: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చోటుచేసుకున్న ఘోర దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు
అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర విచారం ప్రకటించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే స్పందించిన సీఎం, ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read also: Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ పేలుడు.. 8 మంది సజీవదహనం
ప్రమాద తీవ్రతను, అక్కడ నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. గాయపడిన కార్మికులకు తక్షణమే అత్యుత్తమ మరియు నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాలని ఆదేశించారు. ప్లాంట్ లోపల చిక్కుకుపోయిన మిగిలిన సిబ్బందిని సురక్షితంగా వెలికితీసేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
“ప్రమాద స్థలంలోనే ఉండి సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాల్సిందిగా స్థానిక మంత్రులను, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించాం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది.” అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
బాధితులకు సహాయం అందించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆయన అధికారులను గట్టిగా ఆదేశించారు. కాగా, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ పేలుడు.. 8 మంది సజీవదహనం
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Gooty Petrol Bunk: గుత్తిలో రూ. 95 లక్షలతో పెట్రోల్ బంక్ శంకుస్థాపన చేసిన ఎస్పీ!
Kalyandurg SBI Pensioners: పెన్షనర్లకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి
Operation H-FAST: హైదరాబాద్ టు ఏపీ వందల టన్నుల చికెన్ వ్యర్థాలు సీజ్!
Penuganchiprolu Attack : పెనుగంచిప్రోలులో ఘోరం: దైవదర్శనానికి వచ్చిన భక్తులపై కత్తులతో దాడి
Seethanagaram news: మన్యం అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం