
మెగా పవర్స్టార్ రామ్చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే అద్భుతమైన వసూళ్లతో
దూసుకుపోతున్న ఈ చిత్రం, మొదటి వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 292.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా ప్రకటించింది.ఈ సినిమా తొలి రోజే ఏకంగా రూ. 135.36 కోట్ల భారీ ఓపెనింగ్స్తో ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కూడా అదే జోరును ప్రదర్శిస్తూ రెండో రోజు రూ. 46.44 కోట్లు, మూడో రోజు రూ. 54.90 కోట్లు రాబట్టింది. ఆదివారం నాటి వసూళ్లతో కలిపి, కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 292.5 కోట్ల మార్కును అందుకుంది. "బాక్సాఫీస్ ఛాంపియన్ 'పెద్ది' మొదటి వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 292.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త బ్లాక్బస్టర్ రికార్డు క్రియేట్ చేసింది" అంటూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.ఫస్ట్ వీకెండ్లో అద్భుతమైన వసూళ్లు సాధించినప్పటికీ, సోమవారం నుంచి 'పెద్ది' చిత్రానికి అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. వీక్ డేస్లో కూడా ఇదే స్థాయి వసూళ్లను కొనసాగిస్తే, రెండో వారాంతం నాటికి ఈజీగా రూ. 500 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.