
ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ విద్యాభ్యాసం పట్ల తన ఆసక్తిని చాటుతూ TG LAWCET-2026లో ఉత్తీర్ణత సాధించారు. 120 మార్కులకు 57 మార్కులు
ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ విద్యాభ్యాసం పట్ల తన ఆసక్తిని చాటుతూ TG LAWCET-2026లో ఉత్తీర్ణత సాధించారు. 120 మార్కులకు 57 మార్కులు సాధించిన ఆయన 349వ ర్యాంక్ పొందారు. మావోయిస్టు ఉద్యమంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించిన దేవ్ జీ, ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే... ఈ నేపథ్యం లోనే లాయర్ కావాలన్న తన చిరకాల కోరికను నెరవేర్చుకోవాలనే సంకల్పం తో చదువును కొనసాగించారు.
పదో తరగతి వరకే విద్యాభ్యాసం చేసిన ఆయన ఇటీవల ఇంటర్మీడి యట్ పరీక్షలు రాయడమే కాకుండా, అనంతరం TG LAWCET ప్రవేశ పరీక్షకు హాజరై విజయాన్ని అందుకు న్నారు. విద్యకు వయసు అడ్డుకా దని, లక్ష్యం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సాధించ వచ్చని దేవ్ జీ తాజా విజయం మరోసారి నిరూపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు గత కొద్ది రోజులు గా అనారోగ్యంతో బాధపడు తున్న దేవ్ జీ కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాజకీయ నాయకురాలు కల్వకుంట్ల కవిత వెంటనే హాస్పిటల్ కి వెళ్లి ఆయనను పరామర్శిం చారు. దేవ్ జీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసు కున్న ఆమె, వైద్యులతో మాట్లాడి అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. దేవ్ జీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
మెగా డీఎస్సీలో ఎక్కడ రూల్స్ బ్రేక్ చేయలేదు : విద్యాశాఖ కార్యదర్శి
ఆర్థిక నేరగాడు లలిత్ మోడీపై చర్యలు అటకెక్కినట్లేనా?
Disclaimer: All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent..