
ఆఫ్ఘనిస్థాన్తో రేపటి (జూన్ 6) నుంచి మూలాన్పూర్లో జరగనున్న ఏకైక టెస్టుకు భారత జట్టు సిద్ధమవుతోంది. అయితే, ఐపీఎల్ 2026 ముగిసిన కేవలం ఐదు రోజులకే ఈ మ్యాచ్ ఆడుతుండటంతో ఆటగాళ్ల సన్నద్ధతపై మేనేజ్మెంట్
ఆఫ్ఘనిస్థాన్తో రేపటి (జూన్ 6) నుంచి మూలాన్పూర్లో జరగనున్న ఏకైక టెస్టుకు భారత జట్టు సిద్ధమవుతోంది. అయితే, ఐపీఎల్ 2026 ముగిసిన కేవలం ఐదు రోజులకే ఈ మ్యాచ్ ఆడుతుండటంతో ఆటగాళ్ల సన్నద్ధతపై మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా, ఐపీఎల్ ఫైనల్ ఆడిన గుజరాత్ టైటాన్స్ నుంచి కెప్టెన్ శుభ్మన్ గిల్తో సహా ఏడుగురు ఆటగాళ్లు ఈ జట్టులో ఉండటమే ఇప్పుడు పెద్ద సవాల్గా మారిందని భారత సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే అంగీకరించాడు. వారిని మానసికంగా, శారీరకంగా టెస్ట్ క్రికెట్కు సిద్ధం చేయడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని డస్కాటే స్పష్టం చేశాడు.విలేకరుల సమావేశంలో మాట్లాడిన డస్కాటే, జట్టు సన్నద్ధత గురించి పలు విషయాలు పంచుకున్నాడు. పేసర్ మహ్మద్ సిరాజ్ నెట్స్ లో పూర్తి ఫిట్నెస్తో బౌలింగ్ చేశాడని, అతను అందుబాటులో ఉండటం జట్టుకు బలమని తెలిపారు. రవీంద్ర జడేజాకు విశ్రాంతినివ్వడంతో, స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లు ఆడటం ఖాయమని, మూడో స్పిన్నర్ స్థానానికి హర్ష్ దూబే లేదా మానవ్ సుతార్లలో ఒకరిని ఎంచుకుంటామని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.జట్టులో కీలకమైన నెం.3 బ్యాటింగ్ స్థానం ఇంకా అస్థిరంగానే ఉందని డెస్కాట్ ఒప్పుకున్నారు. అయితే, దేశవాళీ క్రికెట్లో రాణించిన దేవదత్ పడిక్కల్, ఐపీఎల్లో మెరిసిన సాయి సుదర్శన్ వంటి ఆటగాళ్లపై నమ్మకం ఉందని చెప్పారు. డబ్ల్యూటీసీ పాయింట్ల దృష్ట్యా ఈ స్థానంలో స్థిరత్వం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. టీ20 ఫార్మాట్ నుంచి టెస్టులకు మారడం సవాలని, ఆటగాళ్ల నిద్ర సమయాలు, వైట్-బాల్