
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
TTD launch Srivari Vaidya Seva voluntary services for pilgrims: శ్రీవారి భక్తులకు మరింత ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలు కల్గజేయాలనే ఉద్దేష్యంతో టీటీడీ మరో ముందడుగు వేసింది. తిరుమలలో ఇప్పటికే అనేక ఆస్పత్రులలో శ్రీవారి భక్తులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక దర్శనాలలో సైతం సామాన్య భక్తులే పరమావధిగా టీటీడీ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. వీఐపీల దర్శనాలు పక్కన పెట్టి మరీ సాధారణ భక్తులకు ఎక్కువగా స్వామివారి దర్శనం అయ్యేలా టీటీడీ చూస్తుంది. ఈక్రమంలో టీటీడీ తిరుమలలో ప్రయోగాత్మకంగా “శ్రీవారి వైద్య సేవ” స్వచ్చంద సేవల్ని ఈరోజు ప్రారంభించింది.
ఏపీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టీటీడీ ఆసుపత్రుల్లో “శ్రీవారి వైద్య సేవ” కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా శుక్రవారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో.. టీటీడీ ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ను ప్రారంభించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. దీనికి అనుభవం గల వైద్యులు అప్లికేషన్లు చేసుకొవచ్చని తెలిపారు.
టీటీడీ ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో సేవలందించేందుకు వచ్చే నిపుణులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేసి ఎక్కువ మంది నిపుణుల సేవలను వినియోగించుకునేలా చర్యలు చేపడతామని వివరించారు.
ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, వైద్య నిపుణులు తమకు అనుకూలమైన తేదీల్లో ఆన్లైన్లో నమోదు చేసుకుని సేవలందించవచ్చు.
వైద్యులతో పాటు, ఇతర నిపుణులకు అందించే సదుపాయాలు..
సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులకు మూడు రోజుల పాటు, ఎంబీబీఎస్ వైద్యులకు ఏడు రోజుల పాటు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం కల్పించనున్నారు. వీరికి తిరుమల, తిరుపతిలో వసతి, భోజన సౌకర్యాలు టీటీడీ ద్వారా అందించబడతాయి. అదే విధంగా.. అశ్విని ఆసుపత్రి, స్విమ్స్, బర్డ్ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, ఎస్వీ గోశాల తదితర టీటీడీ అనుబంధ సంస్థల్లో వైద్య నిపుణులు తమ సేవలను అందించనున్నారు.
హిందూ మతానికి చెందిన ఆసక్తిగల వైద్య నిపుణులు ఆన్లైన్ ద్వారా టీటీడీ అధికారిక వెబ్ సైట్ ను చూసి లో తమ స్లాట్ను బుక్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
Read more: Tirumala: నారాయణవనం వేంకటేశ్వరునికి తిరుమల శ్రీవారి అపురూప కానుక.. ఆ నగల ప్రత్యేకత ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.