
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టేందుకు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టేందుకు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున పరుగుల విధ్వంసం సృష్టించిన వైభవ్, త్వరలోనే భారత పురుషుల సీనియర్ జట్టుకు ఎంపిక కానున్నట్లు క్రీడా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం 15 ఏళ్ల 70 రోజుల వయసున్న వైభవ్ను, ఈ నెల చివర్లో ఐర్లాండ్తో జరిగే రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో సచిన్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో పాకిస్థాన్పై అంతర్జాతీయ అరంగేట్రం చేయగా ఇప్పుడు వైభవ్ ఆ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.అసాధారణ ప్రతిభవైభవ్ సూర్యవంశీకి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాల తరహాలోనే అద్భుతమైన ప్రతిభ, మానసిక దృఢత్వం ఉన్నాయని 1983 ప్రపంచకప్ విజేత మదన్ లాల్ కొనియాడారు. ఈ 15 ఏళ్ల కుర్రాడిని వీలైనంత త్వరగా జాతీయ జట్టులోకి తీసుకురావాలని ఆయన సెలెక్టర్లకు సూచించారు. ఐపీఎల్ 2026లో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్న వైభవ్, ప్రస్తుతం జూన్ 9 నుంచి శ్రీలంకలో జరిగే ఇండియా-ఏ ట్రై-సిరీస్కు సిద్ధమవుతున్నాడు. ఒకవేళ ఐర్లాండ్ పర్యటనకు ఎంపికైతే, అతను ఈ సిరీస్ మధ్యలోనే సీనియర్ జట్టుతో కలవనున్నట్లు సమాచారం. సూర్యకుమార్ యాదవ్పై వేటు? మరోవైపు భారత టీ20 జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న స్టార్ బ్యాటర్