.webp&w=3840&q=75)
హైదరాబాదు నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీసులు గురువారం రాత్రి ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు సాగిన ఈ డ్రైవ్లో
హైదరాబాదు నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీసులు గురువారం రాత్రి ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు సాగిన ఈ డ్రైవ్లో ప్రధానం గా వాహనాల నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్, నకిలీ నంబర్ ప్లేట్లు, నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే నిబంధన లను ఉల్లంఘించిన 2,149 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కీలక ప్రాంతాలను ఎంపిక చేసి లా అండ్ ఆర్డర్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్, మధురానగర్, బోరబండ, సనత్నగర్, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెకింగ్ పాయింట్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సందర్శించారు. తనిఖీల తీరును పరిశీలించిన ఆయన, కొన్ని వాహనాలను స్వయంగా ఆపి నంబర్ ప్లేట్లను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఉన్న వాహనదారులతో మాట్లాడి, చట్టపరమైన నిబంధనలపై అవగాహన కల్పించారు. ఆపరేషన్లో భాగంగా నగరవ్యాప్తంగా మొత్తం 12,098 వాహనాలను తనిఖీ చేశారు.
వీటిలో 8,802 ద్విచక్ర వాహనాలు, 1,693 నాలుగు చక్రాల వాహనాలు, 1,623 ఆటోలు ఉన్నాయి. తనిఖీల్లో 1,406 వాహనాల్లో నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్, 1,132 వాహనాల్లో నంబర్ ప్లేట్ లేకపోవడం, 69 వాహనాల్లో నకిలీ నంబర్ ప్లేట్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో మొత్తం 2,149 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ను సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘ నగా పరిగణించబోమని స్పష్టం చేశారు. నేరస్థులు పోలీసుల నుంచి తప్పించు కోవడానికి నంబర్ ప్లేట్లను మార్చడం, అస్పష్టంగా ఉంచడం లేదా నకిలీ నంబర్లను వినియోగించడం వల్ల ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందన్నారు.
ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై చీటింగ్, ఫోర్జరీ తదితర కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.వాహన దారులు నిబంధనలకు అనుగుణంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వాహనానికి సంబం ధించిన అన్ని ధ్రువపత్రా లను వెంట ఉంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ, రాబోయే రోజుల్లో అన్ని రకాల వాహనాలపై ఈ ప్రత్యేక తనిఖీలు కొనసా గుతాయని తెలిపారు. నగర శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని సీపీ సజ్జనార్ వెల్లడించారు.
ఏపీ లిక్కర్ స్కామ్లో సంచలనం.. జగన్కు ఈడీ నోటీసులు?
ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ట్రక్కు కిందకు దూసుకెళ్లిన మైఖేల్ క్లార్క్ కారు!
Disclaimer: All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent..